నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్తోపాటు రెండు పాస్పోర్టు …
Read More »పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …
Read More »29 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 2వ, 4వ, 6వ సెమిస్టర్ బ్యాక్ల్లాగ్ పరీక్షలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి ప్రారభంకానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
Read More »స్త్రీ నిధి ద్వారా రూ.55 కోట్ల రుణాలు
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూ.55 కోట్ల రుణాలు స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్యలో బుధవారం జిల్లా స్థాయి వాటాదారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో స్త్రీ నిధి ద్వారా రూ.154 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరంకు వార్షిక ప్రణాళిక, మండలాల వారిగా …
Read More »న్యూట్రిషన్ కిట్ నిల్వలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం న్యూట్రిషన్ కిట్ నిల్వ గదిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జిల్లాకు 2000 న్యూట్రిషన్ కిట్లు మంజూరైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి తెలిపారు. కిట్లు నిల్వ ఉంచే స్టాళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూశారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ లక్ష్మణ్ సింగ్, …
Read More »16న ఉద్యోగ మేళా
నిజామాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల16 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ నిజామాబాద్.. బ్రాంచ్ రేలషన్నిప్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. విద్యార్హత ఇంటర్, డిగ్రీ ఆ పైన విద్యార్హత కలిగిన …
Read More »విద్యార్థుల సమస్యలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టవా?
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్సిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రెండేండ్లుగా చెల్లించని రూ.3 వేల 100 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో కామారెడ్డి కలెక్టరేట్ నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి, విద్యార్థులు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ …
Read More »బోధన్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
బోధన్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కావున ప్రభుత్వం స్పందించి బోదన్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు. ఇందుకోసం ఈనెల 19వ తేదీ నుండి పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తామని బోధన్ న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్బంగా వారు …
Read More »బెల్గావ్ కర్ణాటక ట్రక్కింగ్ క్యాంప్కు చిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15 తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ట్రాకింగ్ క్యాంప్కు స్థానిక చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎన్సిసి అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరు 15వ తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గామ్లో జరిగే ఎన్సిసి …
Read More »నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మ దగ్దం
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రేవంత్ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …
Read More »