బాల్కొండ, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …
Read More »ఫీ -రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి
ఆర్మూర్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్ లో ఉన్న ఫీ -రియంబర్స్ మెంట్ను విడుదల చెయ్యాలని ఆర్మూర్ ఆర్.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్ మెంట్ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు …
Read More »రాశివనాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్ పాండ్ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »గోవులకు లంపీ వైరస్… కొనసాగుతున్న చికిత్సలు
ఎడపల్లి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలోని శ్రీ సీతరామ గోశాలలో గోవులకు లంపీ వైరస్ సోకడంతో పలు గోవులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. ఈ క్రమంలో గోవులకు ఎడపల్లి మండల పశు వైద్య సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ సఫీ చికిత్సలు ప్రారంభించారు. సోమవారం ఓ గోవు లంపీ వైరస్తో అనారోగ్యం బారిన పడడంతో వెటర్నరీ అసిస్టెంట్ సఫీయోద్దిన్ అక్కడికి …
Read More »బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి, ఎమ్మెల్యేలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. పాత కలెక్టరేట్ వెనుక భాగంలో ఆర్అండ్బీ కార్యాలయం నుండి ఎన్ఠీఆర్ …
Read More »అటవీ శాఖ అధికారులకు భరోసా కల్పించిన సిపి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విధి నిర్వహణలో అటవీశాఖ అధికారులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు భరోసానిచ్చారు. ఖమ్మం జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారిని హతమార్చిన సందర్భంగా సిపి భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావును గుత్తి కోయలు హత్య గావించిన నేపద్యంలో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు …
Read More »నగర అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ. 658.91 కోట్లు వెచ్చింపు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే, ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడిరతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి …
Read More »పసుపు పంట పరిశీలించిన నాందేడ్ రైతులు
ఆర్మూర్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహరాష్ణ నాందెడ్ జిల్లాకు చెందిన రైతులు సంతోష్ అండే బగవన్, రాంనాత్ షిండే ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పసుపు పంటను పరిశీలించారు. వీరిని తెలంగాణ ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి పలు పసుపు పంట చేలను చూపించారు. పంటలకు సంబంధించిన విషయాలు వివరించారు. పసుపు ఎందుకు ఇలా అయింది అని వారు …
Read More »ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …
Read More »జలశక్తి అభియాన్పై పవర్పాయింట్ ప్రజంటేషన్
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జలశక్తి అభియాన్పై పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో చేపట్టిన ఊట చెరువులు, చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోఫిట్స్ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ లకు …
Read More »