ఆర్మూర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖలీం అహ్మద్ నాయకత్వంలో వందలాది మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి జీవన్ …
Read More »ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పటిష్ట పరచాలి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా తయారైందని, నగదు రహిత వైద్యం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించటం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మెడికల్ రీయంబర్స్మెంట్ కూడా …
Read More »18 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, …
Read More »ప్రజా సమస్యలపై ఎంఆర్వోకు కాంగ్రెస్ వినతి
వర్ని, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం వర్ని మండల కేంద్రంలో రైతు రుణమాఫీ, పోడు భూములు, ధరణి సమస్యల గురించి ఎమ్మార్వో కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, ధరణి పోర్టల్ని వెంటనే రద్దు చేయాలని, పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. రైతుబంధు, …
Read More »ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్వోకు వినతి
ఆర్మూర్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఆలూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించి తహసీల్దార్ దత్తాత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ చట్టాన్ని …
Read More »జనవరి 15 లోపు ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో కలిసి రెండు పడక …
Read More »నాణ్యమైన ఉత్పత్తుల తయారీ దిశగా జెడ్ ప్రక్రియ
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ రంగంలో జెడ్ సర్టిఫికెట్ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ మార్కెటింగ్ విస్తరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఏంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీస్ బాల్ నగర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం జీరో డిఫెక్ట్, జీరో ఈఎఫ్ ఫెక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయ (25) నేరెల్ తాండాకి చెందిన గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్కి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …
Read More »మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పరిశీలించాలి
కామరెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన పాఠశాలలకు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు …
Read More »జనవరి 6 న ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ మహాసభ
కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం బాగయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి స్థాయిలో యువకులతో గ్రామ మండల కమిటీలను నిర్మాణం చేసి …
Read More »