డిచ్పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 5 సంవత్సరాల అప్లైడ్ ఎకనామిక్స్ మరియు ఫర్మసూటికల్ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …
Read More »దళితబంధు యూనిట్ల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్ తేజకు చెందిన టెంట్ హౌస్ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు. బిక్నూర్ మండలం సిద్ది రామేశ్వర నగర్ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్, …
Read More »18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023, జనవరి ఒకటి నాటికి …
Read More »డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా సేవలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీ.శా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో …
Read More »మోటివేషనల్ స్పీకర్ను సన్మానించిన విసి
డిచ్పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :మోటివేషనల్ స్పీకర్ భాగవతుల శివ శంకర్ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.రవీందర్ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్ డైరెక్టర్గా వివిధ కార్పొరేట్ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్ మేనేజ్మెంట్ విషయంపైన ఉపన్యసించారు.
Read More »పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్లో మంగళవారం పోస్ట్ ఆఫీస్ అధికారి వెంకట్రాంరెడ్డి స్థానిక పోస్ట్ ఆఫీస్ను సందర్శించారు. అనంతరం ప్రజలకు తపాలా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిపిఎం షకీర్, ఏబీపీఎం బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More »ఓటర్గా నమోదు చేసుకో – ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా గర్వించు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ భారత దేశములో 18 సంవత్సారాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్గా నమోదు చేసుకోవాలని, కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాలు విద్యార్ధులు అందరు వెంటనే నమోదు చేసుకోవాలని వారి నుండి …
Read More »కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. లింగంపేట, శెట్టిపల్లి సంగారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. లింగంపేటలోని సాయి కృష్ణ, ఉమామహేశ్వర రైస్ మిల్లులను సందర్శించారు. లక్ష్యానికి …
Read More »‘న్యాక్’ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్న వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇప్పించి, సర్టిఫికేట్లను …
Read More »ఉచిత వైద్య శిబిరం…
కామరెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఒక్కో పేషంట్కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, …
Read More »