NizamabadNews

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ …

Read More »

వసతి గృహాలను పరిశీలించిన రాష్ట్ర అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహ సముదాయాన్ని బుధవారం రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగితా రాణి సందర్శించారు. విద్యార్థినుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. భోజనశాలను చూశారు. పరిసరాల్లో ఉన్న మొక్కలను పరిశీలించారు. వసతి గృహం ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. రామారెడ్డి …

Read More »

నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్‌ మిల్లులను సీజ్‌ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. …

Read More »

శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చలి కాలం వచ్చేసింది… ఎందరో అనాథలు, అభాగ్యులు ఎముకలు కొరికే చలిలో రోడ్డుపక్కన కాలం వెళ్లదీస్తుంటారు. విషయాన్ని గమనించి స్పందించిన శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు వారికి సహాయం చేయాలని ముందుకొచ్చారు. పరోపకారార్థ మిదం శరీరం అన్న సుభాషిత వాక్యాన్ని నమ్మి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. నిజామాబాద్‌లోని సుమారు వంద మందికి 31వ తేదీ …

Read More »

ఏఆర్పీ క్యాంప్‌లో యువకుల రక్తదానం

ఎడపల్లి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్‌ గ్రామంలో యువకులు స్వచ్చందంగా రక్త దానం చేసారు. ఈ మేరకు పోలీస్‌ సంస్మరణ దినోత్సవ సందర్బంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసారు. ఈ క్యాంప్‌కు స్థానిక యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు. యువకులంతా కలిసి మొత్తంగా 20 యూనిట్ల …

Read More »

కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ ట్రైనీ అధికారుల (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌) క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ అధికారుల బృందం అక్టోబర్‌ 31 న జిల్లాకు చేరుకున్న విషయం విదితమే. ఈ నెల 4 వ తేదీ వరకు ట్రైనీ అధికారుల బృందాలు వారికి కేటాయించిన …

Read More »

ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ …

Read More »

ఘనంగా ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి, కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, …

Read More »

ముద్ద చర్మవ్యాధి రాకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముద్ద చర్మవ్యాధిపై అవగాహన గోడ ప్రతులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పశువైద్యాధికారులు గ్రామాల్లోని రైతులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, …

Read More »

పీఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో ధన్వంతరీ పూజ

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద పి.ఎం.పి వైద్యుల అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యంలో పి.ఎం.పి వైద్యుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పిఎంపి వైద్యుల రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి వర్మ విచ్చేశారు. అనంతరం ధన్వంతరి పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »