కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు ఇంద్రానగర్ కాలనీ శ్రీ విఘ్నేశ్వర యూత్ ఫెడరేషన్ చిరంజీనీ మధు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీనీ మధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక పండుగ సందర్భంగా ఐదవ రోజు కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి కాలనీలోని మహిళ భక్తులు …
Read More »భావితరాలకు మేధావులను అందించేంది ఉపాధ్యాయులే
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని …
Read More »15న నట్టల నివారణ మందుల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15న జాతీయ నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని కాన్ఫరెన్స్ హాల్లో టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న మండల స్థాయిలో నట్టాల నివారణ మందుల పంపిణీపై టాస్క్ఫోర్స్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ …
Read More »ప్రగతి భవన్లో గురుపూజోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురుపూజోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు …
Read More »ఇందూరుకు కళాభారతి ఆడిటోరియం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందామని ముఖ్యమంత్రి బహిరంగ సభలో పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని, ఉమ్మడి జిల్లాలోని మిగితా 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్ కు అదనంగా 10 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …
Read More »ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా న్యూ కలెక్టరేట్ ప్రారంభోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద స్పీకర్ …
Read More »సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల
డిచ్పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 7979 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా (బాలురు : 2959 బాలికలు : 5020) మొత్తం 3348 మంది ఉత్తీర్ణత సాధించినట్లు (బాలురు …
Read More »టీయూలో 6 వ తేదీన వార్షికోత్సవం
డిచ్పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు అనగా మంగళవారం 6 వ తేదీన సాయంత్రం 5 గంటలను క్రీడా మైదాన ప్రదేశంలో వార్షికోత్సవం – 2022 నిర్వహింపబడుతుందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, …
Read More »గురువులు సమాజ దిశా నిర్దేశకులు
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా …
Read More »
జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్ …
Read More »