నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెబ్భై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు మంగళవారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »కామారెడ్డిలో గాంధీ చిత్రప్రదర్శన
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రిచర్డ్ అటెన్ తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. కామారెడ్డి పట్టణంలోని 4 థియేటర్లలో మంగళవారం ఉచిత సినిమా ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులను బస్సులలో థియేటర్ల వద్దకు తీసుకువచ్చి సినిమాను చూపించారు. ప్రియా ఏషియన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి, సినిమా చూడడానికి వచ్చిన …
Read More »ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండిరచారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, జీవన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …
Read More »జిల్లా కవులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘‘సహస్రాబ్ది మహా మనిషి మహాత్మా గాంధీ’’ అనే అంశంపై కవితా సంకలనం రూపొందిస్తుందని తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సంచిక కోసం జిల్లాలోని కవులు, కవయిత్రులు 15 పంక్తులకు మించని కవితను మహాత్ముని జీవితం, మహాత్ముని ఆదర్శాలు …
Read More »13న ప్రజ్ఞాభారతి సమావేశం
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖండ భారత్ గొప్పతనం అందరికీ తెలియజేస్తూ, దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవడం కోసం ఇందూరు ప్రజ్ఞావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ కన్వీనర్ ధారా చంద్రశేఖర్ తెలిపారు. 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక వినాయక్నగర్లోని బస్వాగార్డెన్లో సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్. సోమానీ విచ్చేస్తారని, అలాగే …
Read More »ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా జనరల్ కౌన్సిల్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి, ఎన్ఆర్ భవన్లో జరిగింది. ముందుగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన బిగిపిడికి జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కౌన్సిల్లో ముఖ్య వక్తగా వచ్చిన పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి …
Read More »భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. అన్ని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో నిర్దేశిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఉత్సవాల …
Read More »ప్రజావాణికి 67 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటు ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల …
Read More »కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్ బిడ్డ హుస్సాముద్దీన్కు కాంస్య పతకం
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన మరో బిడ్డ సుబేదార్ హుస్సాముద్దీన్ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా, తెలంగాణ కీర్తిని …
Read More »