NizamabadNews

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్‌ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. శాస్త్రుల దత్తాద్రిరావు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదనీ, సకాలంలో పెన్షన్‌ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్‌ రక్త నిధి కేంద్రంలో శనివారం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ప్రస్తుత తరుణంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, వివిధ …

Read More »

రేపు టియును సందర్శించనున్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ఆగస్ట్‌ 7 వ తేదీ ఆదివారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకే విద్యార్థి నాయకులందరు గవర్నర్‌ని కలుసుకొని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించాలని వారు కోరడం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల …

Read More »

ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ 88 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

కామారెడ్డిలో ఆచార్య జయశంకర్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ రగిలించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. స్వయం పాలనలోని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని …

Read More »

వజ్రోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు …

Read More »

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాల

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సైబర్‌ నేరాలపై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. లాటరీ వచ్చిందని, జీఎస్టీ చెల్లించాలని మాయ మాటలు చెప్పి ఆన్లైన్లో మోసగాళ్లు నగదు దోచుకుంటున్నారని చెప్పారు. మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. డయల్‌ 1930 …

Read More »

డిజిటల్‌ సేవలను వినియోగించాలి

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిజిటల్‌ సేవలను వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకింగ్‌ ప్రణాళికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచనల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ,మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మొదలగు సౌకర్యాలను అందించాలని సూచించారు. ఖాతాదారులు …

Read More »

యువత రక్తదానానికి ముందుకు రావాలి

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కళాభారతిలో పోటి పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసిన పోటీ పరీక్షల అభ్యర్థులను అభినందించారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న …

Read More »

ప్రజాస్వామ్యంలో కుట్రలకు చోటు లేదు

హైదరాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండిరచారు. బంజారాహిల్స్‌ లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, జీవన్‌ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్న ఎమ్మెల్సీ కవిత, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »