కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని …
Read More »రైతులకు సదవకాశం… వినియోగించుకోండి…
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు చేపలు, రొయ్యలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనుల పురోగతి పై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఉపాధి హామీ ద్వారా చేపల, రొయ్యల పెంపకం కోసం ఊట కుంటలు …
Read More »విద్యానికేతన్ పాఠశాల బస్సుల అనుమతిని రద్దు చేయాలి…
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో గల విద్యానికేతన్ పాఠశాల చెందిన బస్సులను పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ఇతర ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో నడపడం జరుగుతుందని కనీస అవగాహన లేని వ్యక్తులను బస్సు డ్రైవర్లుగా నియమించుకోవడం వల్లనే ఇష్టానుసారంగా బస్సులను నడిపించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా రవాణా అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలకు చెందిన బస్సులను అనుమతులను …
Read More »పనుల్లో నాణ్యతా లోపాలకు తావుండకూడదు
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా పక్కాగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంగళ్ రావు నగర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), వినాయక్ నగర్లోని ప్రభుత్వ …
Read More »రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఎడపల్లి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేగంగా వెళుతున్న ట్రైన్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జాన్కంపేట్ గ్రామానికి చెందిన పెసరి వీరమల్లు (63) అనె వృద్ధుడు పుట్టుకతో మూగ, ఇతడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన పశువులు కాస్తూ ఉంటాడు. శుక్రవారం …
Read More »ఫోటో వస్తేనే.. ఉపాధి కూలి
నిజాంసాగర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఏపీఓ శ్రీనివాస్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఉదయం ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోటో ఆన్లైన్లో అప్డేట్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఫోటో ఆన్లైన్లో అప్డేట్ అయితే హాజరు పడుతుందని, ఉదయం ఆన్లైన్లో ఫోటో రాకపోతే హాజరు పడదని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి …
Read More »సొంతింటి కల సాకారం చేసుకోండిలా
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్ల పక్కన ప్రభుత్వం అన్ని వసతులతో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్లో ప్లాట్ల విక్రయానికి నవంబర్ 14 న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రీ బిడ్డింగ్ సమావేశం …
Read More »ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గోడౌన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ …
Read More »టియు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఆచార్య సత్యనారాయణ
డిచ్పల్లి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఆచార్య సత్యనారాయణని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీందర్ గుప్త ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య విధ్యావర్ధిని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య వి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని ఇచ్చినందుకు వి.సి., రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయంతో తే.యు.ను ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయుటకు …
Read More »రైతు సంక్షేమం కొరకే కొనుగోలు కేంద్రాలు
కామరెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పోల్కంపేట్ సర్పంచ్ పద్మ నాగరాజు అన్నారు. శుక్రవారం షేట్పల్లి సంగారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోల్కంపేట్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. …
Read More »