NizamabadNews

బాధిత కుటుంబాలకు టార్పాలిన్ల పంపిణీ

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారీ వర్షాల నేపథ్యంలో గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు టార్పాలిన్‌ కవర్లను గురువారం పంపిణీ చేసినట్లు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో తాసిల్దార్‌ సహకారంతో బాధితులకు టార్పాలిన్‌ కవర్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌, రాష్ట్ర …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ ఫామ్‌ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ తో పాటు రైతులకు అదనపు ఆదాయం …

Read More »

పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయంగా మారిన నిజామాబాద్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం సందర్శించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్‌ నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి …

Read More »

అధికారులందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆయన కలెక్టర్‌ సి …

Read More »

ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం సాయంత్రం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యామ్‌ పై నుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావుకు ఫోన్‌ ద్వారా పరిస్థితిని వివరించారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి …

Read More »

తెలంగాణ యూనియన్‌కు అంతర్జాతీయ గుర్తింపు

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్విట్జర్లాండ్‌ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్‌ అండ్‌ వుడ్‌ వర్కర్స్‌ ఇంటర్నేషనల్‌ (బిడబ్ల్యుఐ) అనే గ్లోబల్‌ యూనియన్‌ ఫెడరేషన్‌లో జగిత్యాలకు చెందిన ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌కు సభ్యత్వం లభించింది. 127 దేశాలలో 351 ట్రేడ్‌ యూనియన్‌లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు బిడబ్ల్యుఐ ప్రాతినిధ్యం వహిస్తున్నది. భారత్‌, పనామా, మలేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినా ఫాసో, …

Read More »

అలుగుల వద్దకు ప్రజలెవరు రావద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును బుధవారం పరిశీలించారు. తూము వద్ద ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా …

Read More »

కలెక్టర్లకు మంత్రి ఫోన్‌… క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి…

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారి ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి …

Read More »

సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటిపారుదల, …

Read More »

పురాతన ఇళ్ళు ఖాళీ చేయించాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్‌ , వ్యవసాయ, రెవెన్యూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »