కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, గృహాల వివరాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగూత్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 469.5 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. సాధారణ …
Read More »అన్ని పరీక్షలు వాయిదా
డిచ్పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అధిక వర్ష సూచన ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ మూడు రోజులలో (11,12,13 తేదీలలో) జరిగే అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసి మరల 14 వ తేదీ నుంచి కొనసాగించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు బంద్
బోధన్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు మూలమైన సాలురా అంతర్రాష్ట్ర మంజీర నది ఉగ్రరూపం దాల్చుతూంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. ఇందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. సాలూర వంతెన నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు …
Read More »అతి భారీ వర్షాల కారణంగా ప్రజావాణి వాయిదా
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న కారణంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. సోమవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే …
Read More »అంతటా అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వరద పరిస్థితుల గురించి సమీక్షించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ …
Read More »సోమవారం ప్రజావాణి లేదు
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
Read More »వరదనీరు ఉదృతంగా వస్తుంది.. కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం…
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు ఉదృతంగా వస్తుందని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :బక్రీద్, తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుక, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకునే తొలి ఏకాదశి వేడుకలు ఒకేసారి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా …
Read More »లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం పర్యటించారు. జలమయంగా మారిన ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. బోధన్ రోడ్, అర్సపల్లి ఎక్స్ రోడ్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, తన వెంట ఉన్న అధికారులకు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఆటా మహాసభల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి …
Read More »