NizamabadNews

నిండుకుండలా జన్నెపల్లె పెద్దచెరువు

నవీపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం జన్నెపల్లె గ్రామములో గల పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.

Read More »

15 న రిటైర్డ్‌ ఉద్యోగుల ధర్నా

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజామాబాద్‌ జిల్లాశాఖ తెలిపింది. ముఖ్యంగా పే రివిజన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలని, ప్రతి నెల మొదటి తారీకునే …

Read More »

త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్‌ పండుగ

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్‌ ఆజహ (బక్రీద్‌ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్‌ అని పిలుస్తారు. అరబిక్‌లో …

Read More »

మాటు కాలువ సమస్య పరిష్కరించండి…

నవీపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని నాళేశ్వర్‌ ప్రధాన మాటు కాలువ సమస్య రైతులకి తలనొప్పిగా మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంకాగానే వరద నీరు కారణంగా సుమారుగా 50 ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకి మాటుకాలువ సమస్యపై విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. మాటు కాలువ తెగిన సమయంలో 50 …

Read More »

వర్షాల నేపథ్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్‌ రూం నెంబరు 08462 220183 కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read More »

నూతన వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే రుణాలను నూతన వ్యాపారాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మహిళలకు పాలు …

Read More »

ఒత్తిడి జయిస్తేనే ఉద్యోగ జీవితం విజయవంతం

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పని ఒత్తిడిని జయిస్తేనే ఉద్యోగ జీవితంలో విజవంతమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ ఉద్యోగుల క్రియేషన్‌ రూములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ జీవితంలో ఉన్న పని ఒత్తిడి జయించి చక్కటి ప్రణాళికతో నిర్వహణ చేపడితే ఉద్యోగిగా విజయం సాధించడం సులువుతోందని తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులే …

Read More »

మొక్కలు లేని రోడ్డు కనిపిస్తే కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44, 63 వ నెంబర్‌ జాతీయ రహదారులు మొదలుకుని అన్ని మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండాలని, ఎక్కడైనా మొక్కలు కనిపించకపోతే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశిత స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ …

Read More »

అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అటవీ భూముల సంరక్షణ, హరితహారం కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం కాన్ఫరెన్స్‌ హాల్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలని సూచించారు. వచ్చే హరితహారంలో అటవీ భూములు అటవీశాఖ ఆధ్వర్యంలో …

Read More »

త్వరలో కారుణ్య నియామకాలు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి త్వరలోనే కారుణ్య నియామకాల ద్వారా 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడిరచారు. శుక్రవారం నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుమల బస్సులను ప్రారంభించారు. అనంతరం చైర్మన్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ టిఎస్‌ ఆర్‌టిసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1016 నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌టిసికి చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలు త్వరలో చెల్లించడం జరుగుతుందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »