NizamabadNews

ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేబీస్‌ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో యాంటీ రేబిస్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ సంవత్సరం …

Read More »

కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఎం.పీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, …

Read More »

రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బోధన్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ ఇన్స్పెక్టర్‌ వేణు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న డబ్బులకోసం బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్లలో గంటల తరబడి ఇబ్బందులు పడకుండా దగ్గరలోని పోస్ట్‌ ఆఫీసుల్లో రైతు బంధు డబ్బులు తీసుకునే అవకాశం తపాలా శాఖ కల్పించిందన్నారు. పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా రైతుబంధు డబ్బులు పొందడానికి …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలోని పెండిరగ్‌ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో తహసీల్దార్‌ లసమావేశంలో మాట్లాడారు. టీఎం33 మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూములపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు …

Read More »

రాశి వనాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశి వనాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మంగళవారం సందర్శించారు. రాశి వనంలో ఉన్న వివిధ రకాల వృక్షాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాశి వనంలో తేనెటీగల పెంపకం కోసం స్థలాలను పరిశీలించారు. తేనెటీగల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల అభివృద్ధి పనుల వివరాలను …

Read More »

స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలవాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలువాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలను, బహుమతులను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా …

Read More »

పిహెచ్‌.డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో డీన్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1,2 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో గల ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ మరియు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుల్లో క్యాటిగిరి – 1 …

Read More »

ఐదుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

మాచారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డా.రవి కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పిహెచ్‌సి పరిధిలో ఉన్న టీబీ కేసుల గురించి, వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్సల గురించి వాకబు చేశారు. వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన పథకం ద్వారా డైరెక్ట్‌ …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »