NizamabadNews

వెల్నెస్‌ సెంటర్‌ను వినియోగించుకోండి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల, జర్నలిస్టుల, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో భాగంగా నిజామాబాదులో ఏర్పాటైన వెల్‌ నెస్‌ సెంటర్‌ నందు మందులతోపాటు గా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీనిని రిటైర్డు ఉద్యోగులందరూ ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్రావు విజ్ఞప్తి చేశారు. …

Read More »

అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్‌ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరిగేషన్‌, ఉపాధి హామీ, …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్‌ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. …

Read More »

రెండోరోజు ప్రశాంతంగా పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »

ఒలింపిక్‌ డే రన్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్‌ డే రన్‌ ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. స్థానిక రాజరాజేంద్ర థియేటర్‌ చౌరస్తా నుండి చేపట్టిన ఒలింపిక్‌ పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్‌, తాను కూడా క్రీడా జ్యోతిని చేతబూని ఒలింపిక్‌ రన్‌లో భాగస్వాములయ్యారు. బడాబజార్‌, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా ఒలింపిక్‌ …

Read More »

ఫలించిన చర్చలు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్‌, ట్రై పిల్లర్‌, క్లర్క్స్‌ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుజరాతి …

Read More »

ప్రసవాలు జరుగని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జీతాలు నిలుపుదల చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం లేకపోయినా సిజీరియన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో నూటికి నూరు శాతం సీజీరియన్‌ కాన్పులే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో …

Read More »

పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల ఆవరణలో బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) ఆధ్వర్యంలో బడిబాట సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని …

Read More »

వంద శాతం పంట రుణాలు అందించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం బ్యాంక్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4778 కోట్లకు ఇప్పటికి రూ.3442 కోట్లు రుణ వితరణ చేసి …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 8 వేల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »