NizamabadNews

ముస్తాబవుతున్న సర్కారు బడులు సరే… పాఠ్య పుస్తకాల జాడేదీ…?

నిజాంసాగర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా మే నెలలోనే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటాయి. కానీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ముద్రణ కాక గోదాంలోకి చేరలేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు సక్రమంగా నడవని విషయం తెలిసిందే. ఈ సారి సకాలంలో స్కూళ్లు తెరుస్తున్నపటికి విద్యాబోధనకు …

Read More »

వర్షపు నీటిని సంరక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం కేంద్రీయ భూగర్భజల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడు …

Read More »

చిన్నాపూర్‌ పార్కును సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో గల చిన్నాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, సోలార్‌ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు …

Read More »

బాబాయ్‌కు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల …

Read More »

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, ఆరోగ్య రక్ష, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, జిల్లా యువజన, క్రీడలు, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »

రక్తదాత లావణ్య సేవలు అభినందనీయం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్‌ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్‌ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్‌కి వెళ్లి సకాలంలో …

Read More »

యోగాతో మానసిక ప్రశాంతత

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ నిజామాబాద్‌ యూనిట్‌, ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలలో మంగళవారం 8 వ …

Read More »

రావి ఆకుపై యోగ చిత్రం

నిజాంసాగర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది, దానిని వెలికి తీస్తే ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగ గలుగుతారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక వారు కళలకు దూరమవుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కళాకారుడు జీవన్‌ నాయక్‌ జీవితంలో అవరోధాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సూక్ష్మ కళాకారుడుగా పేరు గాంచాడు. బాన్సువాడ మండలం పోచారం …

Read More »

భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యవసాయ …

Read More »

కారు చెట్టుకు ఢీకొని యువకుని మృతి

మోర్తాడ్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రం శివారులోని 63వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కదే మృతి చెందడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని మోర్తాడ్‌ ఎస్‌ఐ ముత్యం రాజు తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు హెరిటీగ వాహనం నెంబరు టిఎస్ 21 జి 1919 లో నిజామాబాద్‌ వైపు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »