డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా జూన్, 21 వ తేదీ మంగళవారం నుంచి జూలై 12 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. …
Read More »టీయూ కళాశాలను పర్యవేక్షించిన వీసీ
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని తరగతులను సోమవారం ఉదయం పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, బాటనీ, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, బయో టెక్నాలజీ వంటి విభాగాలలో జరుగుతున్న తరగతులను వీసీ సందర్శించారు. విభాగాల వారిగా అటెండెన్స్ రిజిస్టర్స్, అకడమిక్ డైరీలను …
Read More »ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
నందిపేట్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో నిర్మించతలపెట్టిన శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణ స్థలం వద్ద వేద పండితులు, ఆలయ నిర్మాణ కర్తలు జీవన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జీవన్ రెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ …
Read More »సోమవారం ప్రజావాణి ఉంది
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయ వచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, రోడ్లు, మునిసిపల్, గ్రామపంచాయతీ, ఆర్టీసీ, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలపై ఫిర్యాదులు …
Read More »ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టమీదే
బాల్కొండ, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మత్తుల పనులను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 17.40 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. డ్యాం మీద అధికారులతో,రైతులతో కలిసి కాలి నడకన కలియ తిరిగారు. ఈ …
Read More »డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబ సభ్యులను ఓదార్చిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండి స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు, విధులకు హాజరు కావాలని శనివారం ఆర్టీసీ అధికారులు ఫోన్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేష్, ఆర్.ఎం.సీఐ అధికారుల వేధింపుల వలన …
Read More »పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ …
Read More »జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ …
Read More »రైతుబంధు ఏది?.. ఎదురు చూస్తున్న అన్నదాతలు
నిజాంసాగర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి సీజన్లో వేసిన పంటలు అమ్ముకున్న రైతులు ప్రస్తుతము వానకాలం సీజన్ పంటలపై దృష్టి మళ్ళించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తెలంగాణ సర్కార్ అన్నదాతలు ఆదుకోవడానికి 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు పంటలకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. …
Read More »