డిచ్పల్లి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. అదేవిధంగా 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో …
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ తహసిల్దార్ కార్యాలయంను సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తహసిల్దార్ను ఆదేశించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూడాలని తహసీల్దార్ వెంకట్ రావుకు సూచించారు.
Read More »భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కె.ఆర్. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ వెంకటేశం, సిబ్బంది 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పూలాంగ్లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్ ఉందన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సుమారు లక్ష రూపాయల విలువగల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకొని స్టేషన్లో అప్పగించారు. నిందితుని వివరాలు : షేక్ …
Read More »లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు 20 సీట్లు కేటాయించారు. మూడో …
Read More »పట్టణ ప్రగతి పనుల పరిశీలన
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. అయ్యప్ప నగర్లోని పలు రోడ్లు సందర్శించారు. వ్యాపార సమస్తల ముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.
Read More »పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏ.ఓ సుదర్శన్లకు …
Read More »లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ దంపతులు
నందిపేట్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం సిహెచ్ కొండూరులో నూతనంగా నిర్మితమైన రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సోమవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి దంపతులు సందర్శించారు. గత మూడు రోజులుగా ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్ దంపతులకు సద్బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. కలెక్టర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర, …
Read More »ఓపెన్ యూనివర్సిటీలో హరితహారం
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …
Read More »సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్ మీదే
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్ అయ్యి …
Read More »