కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ ఆవరణలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు …
Read More »విఆర్ కె విద్యార్థులకు స్పీకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ సెషన్
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వి ఆర్ కే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్ ఎమినిట్ జామ్ రౌండు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా …
Read More »పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
డిచ్పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఎడ్ రెండవ సంవత్సరపు మూడో సెమిస్టర్ ( రెగ్యులర్) చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు ఫిబ్రవరి 8వ తేదీ వరకు చెల్లించ వచ్చునని, 100 రూపాయల పరాధ రుసుముతో 10వ తేదీ వరకు చెల్లించ వచ్చునని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ …
Read More »స్వాతంత్రోద్యమ అమరవీరులకు ఘన నివాళులు
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం …
Read More »స్వాతంత్య్ర అమరవీరులకు ఘన నివాళులు
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి.30, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 5.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.51 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.38 వరకుకరణం : బవ సాయంత్రం 5.47 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.17దుర్ముహూర్తము : ఉదయం 10.21 …
Read More »ఉపాధి పనులలో కూలీల సంఖ్య పెంచాలి…
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో చేపట్టే ఉపాధిహామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ప్రాపర్టీ పన్ను, త్రాగునీరు, సి.సి.చార్జీలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో …
Read More »నిరంతర సాధనయే విజయానికి కారణం…
బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి విద్యార్థి నిరంతర సాధన దిశగా కృషి చేసినట్లయితే విజయాలు తమ దరికి చేరుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు నక్క నవీన్ అన్నారు. బుధవారం సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పాటు …
Read More »పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …
Read More »సౌదీలో భారత రాయబారిని కలసిన కార్మిక నేతలు
హైదరాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని భారత రాయబారి డా. సూహెల్ ఎజాజ్ ఖాన్ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్ అఖ్తర్ లు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న …
Read More »