కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్ పూర్తి …
Read More »పల్లె ప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పించాలి…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండ, లింగుపల్లి, అంచనూర్, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జంగంపల్లిలో …
Read More »అధికారుల బదిలీ…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జూబ్లీహిల్స్ కార్యాలయానికి బదిలీపై వెళ్లడం జరిగింది. ఎస్.ఎస్.నగర్లో తహసిల్దార్ గా పనిచేస్తున్న రవీందర్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవ …
Read More »వాయిదా పడిన పరీక్షలు జూలై 6 నుండి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మార్చి, ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ 4వ, 2వ సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షలు లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాటిని జూలై 6,7,8 తేదీల్లో 4వ సెమిస్టర్ పరీక్షలఱు, 9 నుంచి 15 వరకు రెండో సెమిస్టర్ …
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
బోధన్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …
Read More »మహిళలు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సవిత అనే మహిళకు ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన కవిత మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ మహిళలు రక్త దానానికి ముందుకు …
Read More »అన్ని రంగాల్లో పల్లె ప్రగతి జరగాలి
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపీడిలు, ఏపివోలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »26 నుంచి ఉచిత ఐబీపీఎస్ శిక్షణ
హైదరాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టీనా తెలిపారు. ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. …
Read More »ఆన్లైన్ మెమోలతో ప్రవేశాలు పొందొచ్చు
హైదరాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్సైట్ నుంచి ఆన్లైన్ మెమో ఆఫ్ మార్క్స్ (షార్ట్ మెమో) ను డౌన్లోడ్ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన …
Read More »పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ది ఫలాలు
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివనగర్, భూంపల్లి, పద్మాజివాడి, తిరుమన్పల్లి, ఉప్పల్వాయి, రామారెడ్డి, గర్గుల్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు …
Read More »