Breaking News

    NizamabadNews

    గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రం అందజేసిన మంత్రి

    హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాలో మృతి చెందిన కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య కుటుంబానికి మంగళవారం రూ.5 లక్షల గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రం (ప్రొసీడిరగ్స్‌) ను మంత్రి పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఒక కార్యక్రమంలో అందజేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి …

    Read More »

    పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం

    కామరెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల సృజన్‌ బుధవారం జన్మదిన సందర్భంగా 11వసారి ఏ పాజిటివ్‌ రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రతి జన్మదినానికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా …

    Read More »

    దీపావళి సందర్భంగా అగ్నిమాపక అధికారి పలు సూచనలు

    కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలిపారు. టపాసులు కొనే సమయంలో నాణ్యత గల టపాకాయలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. …

    Read More »

    సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కగా చేపట్టాలి…

    బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పక్కాగా చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్యుమారెటర్స్‌, సూపర్వైజర్స్‌ సమగ్ర సర్వే చేపట్టేటప్పుడు పాటించాల్సిన సూచనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం …

    Read More »

    పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటు

    నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి రూ. 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వీటికి అదనంగా మరో రూ. 10 కోట్లను …

    Read More »

    మిల్లర్లు ధాన్యానికి బ్యాంక్‌ పూచికతు ఇవ్వాలి

    కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరం లో బుధ వారం ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరం వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి మిల్లర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ పూచీకతు తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కోరారు. అలాగే మిల్లర్లు ధాన్యాన్ని తొందరగా మిల్లులో దించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మిల్లర్లూ, …

    Read More »

    జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

    నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి …

    Read More »

    సుప్రీం తీర్పును రద్దు చేయాలని వినతి

    బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల ఎస్సీ ఉప కులాలను విడదీసి రాజకీయ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఎస్సీ వర్గీకరణ …

    Read More »

    విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

    కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తా సమీపంలోని ఎస్‌.సి.బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ, వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజూ చేస్తున్న దినచర్య, బోధన, …

    Read More »

    9వ సారీ రక్తదానం చేసిన భుస రాజు…

    కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన భూసరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరూప (45) కు అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాత్సల్య రక్త సొసైటీలో 9వ సారి …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »