డిచ్పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »టియులో అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్
డిచ్పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్ (బాలికల) టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఆచార్య రవీందర్ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ …
Read More »జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్ రెగ్యులర్ / బ్యాక్ లాగ్ థియరీ …
Read More »29 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 2వ, 4వ, 6వ సెమిస్టర్ బ్యాక్ల్లాగ్ పరీక్షలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి ప్రారభంకానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
Read More »ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్
డిచ్పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »సాగునేలను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రయోజనం
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ …
Read More »మాస్ కమ్యూనికేషన్లో మంతెన రవికుమార్కు డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ (ఎంసిఎన్) విభాగంలో మంతెన రవి కుమార్కు పీ హెచ్డి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆచార్య కె. శివశంకర్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ తెలుగు ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్ విత్ ఏన్ ఎంపసిస్ ఆన్ ద పోస్ట్ కోవిడ్-19 పండేమిక్’ ‘అనే అంశంపై రవి …
Read More »విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి …
Read More »కబడ్డి జట్ల ఎంపిక
డిచ్పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. సెలక్షన్స్ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …
Read More »హాకీ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్ జోన్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …
Read More »