dichpally

ఉర్దూలో మీర్‌ అబేద్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో పరిశోధక విద్యార్థి మీర్‌ అబేద్‌ అలీకి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. ఉర్దూ పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్‌ అండ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. …

Read More »

టీయూ ఇంచార్జి రిజిస్ట్రార్‌గా బి. విద్యావర్ధిని

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంచార్జి రిజిస్ట్రార్‌ గా వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ బి. విద్యావర్ధిని మంగళవారం నియమింపబడ్డారు. దీనికి సంబంధించిన ఆర్డర్‌ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. ఆచార్య బి. విద్యావర్ధిని ప్రస్తుతం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇది వరకు కూడా ఆమె రిజిస్ట్రార్‌గా కొంత …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో గంధం కు డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వి. …

Read More »

టీయూలో ఘనంగా జెండా ఆవిష్కరణ

డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదురుగా 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దినోత్సవాలలో భాగంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌తో కలిసి మహాత్మా గాంధీ, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పూల మాలలను అర్పించి గౌరవ వందనం చేశారు. తదనంతరం తమ తమ విధుల్లో …

Read More »

కళ్యాణలక్ష్మి, శాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ధర్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి రైతు వేదికలో జడ్పిటిసి సభ్యుడు బాజిరెడ్డి జగన్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, శాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్‌ ఇచ్చిన అన్ని హామీలను నెర …

Read More »

క్యాంపస్‌ డ్రైవ్‌లో 34 మంది సెలెక్ట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎసెన్షియా బయో పార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగాల కోసం గురువారం ఉదయం క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌ జరిగిన రాత పరీక్షలో 34 మంది ఎమ్మెస్సీ నాల్గవ సెమిస్టర్‌ విద్యార్థులు సెలెక్ట్‌ అయ్యారు. ఈ నెల 16 వ తేదీన సెలెక్ట్‌ అయిన విద్యార్థులకు హైదరాబాద్‌లో …

Read More »

వృక్షశాస్త్రంలో కృష్ణవేణికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో శ్రీపతి కృష్ణవేణి రూపొందించిన సిద్ధాంత గ్రంథంపైన జరిగిన వైవా-వోక్‌ కార్యక్రమంలో డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య ఎమ్‌. మమత పర్యవేక్షణలో కృష్ణవేణి ‘‘యాంటీ మైక్రోబియల్‌ యాక్టివిటీ ఆఫ్‌ కాటిల్‌ యూరిన్‌ అండ్‌ ఇట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ ప్లాంట్‌ గ్రోత్‌’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్ర విభాగంలో …

Read More »

పీజీ పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్‌) 25 తేదీ …

Read More »

16 వరకు పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ (థియరీ అండ్‌ ప్రాక్టికల్‌) రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల (ఆగస్ట్‌) 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఆంతేగాక ఆలస్య అపరాధ రుసుము 100 రూపాయలతో ఈ నెల (ఆగస్ట్‌) 18 వ తేదీ …

Read More »

25 నుంచి పీజీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మరియు ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్‌) 25 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »