dichpally

తెలంగాణ యూనివర్సిటీ టాప్‌ర్యాంకులో నిలవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ (చాన్స్‌లర్‌) డా. తమిళి సై సౌందర రాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. మొదట పరిపాలనా భవనానికి విచ్చేసిన గవర్నర్‌కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ స్వాగతం పలికి ఆహ్వానించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కో – ఆర్డినేటర్‌ …

Read More »

టిీయూలో ఘనంగా జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శనివారం ఉదయం డా. కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 88 వ జయంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ జాతిపిత డా. కొత్తపల్లి జయశంకర్‌ …

Read More »

రేపు టియును సందర్శించనున్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ఆగస్ట్‌ 7 వ తేదీ ఆదివారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకే విద్యార్థి నాయకులందరు గవర్నర్‌ని కలుసుకొని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించాలని వారు కోరడం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల …

Read More »

వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్‌కు పిహెచ్‌.డి

డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్‌ ‘‘భారత దేశ బ్యాంకింగ్‌ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్‌ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని …

Read More »

క్యాంపస్‌లో 89 మందికి బూస్టర్‌ డోస్‌

డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం కూడా బూస్టర్‌ డోస్‌ టీకా క్యాంప్‌ ఏర్పాటు చేశామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. శుక్రవారం 210 మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయగా, శనివారం 89 మందికి వేశారని తెలిపారు. …

Read More »

టీయూను సందర్శించిన యూకే బిపిపి యూనివర్సిటీ అధికారులు

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రిటన్‌ (యూకే) లోని బిపిపి యునివర్సిటీ అధికారులు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ వారికి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చారు. యూకేలోని అతి పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రతిష్ఠాత్మకమైన బిపిపి యూనివర్సిటీ అధికారులు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఎంఒయు కుదుర్చుకొనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయాన్ని …

Read More »

టీయూలో 210 మందికి బూస్టర్‌ డోస్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం ఉదయం బూస్టర్‌ డోస్‌ టీకా క్యాంప్‌ను ఏర్పాటు చేశామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. మొత్తం 210 మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేశారని అన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ …

Read More »

సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ కు 13 మంది హాజరు

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మొత్తం 13 మంది హాజరైనట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం నేషనల్‌ సర్వీస్‌ క్యాడెట్‌ (ఎన్‌సిసి) 11 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక …

Read More »

లైబ్రరీకి పుస్తకాలు అందజేసిన మంత్రి

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (జనరల్‌ లైబ్రరీ) కి నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గ శాసన సభాసభ్యులు మరియు రోడ్లు, భవన నిర్మాణాలు, శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తరఫున తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న 90 వేల …

Read More »

మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. 65 మంది విద్యార్థులకు టెస్ట్‌ చేయగా ముగ్గురు విద్యార్థులకు పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇది వరకే 17 మందికి పాజిటీవ్‌ రాగా అందులో ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »