హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల పట్టణం 29వ వార్డు కు చెందిన కుక్కల చిన్న భీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్లో అక్రమ నివాసిగా చిక్కుకుపోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్ మారో (ఎముక మూలుగు) వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. బోన్ మారో మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగ లక్ష్మి కాంగ్రేస్ …
Read More »ఖతార్లో జాడలేని జగిత్యాల జిల్లావాసి
జగిత్యాల, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖతార్లో పనిచేస్తూ జాడ తెలియకుండా పోయిన తన భర్త రాసూరి రాజేందర్ ఆచూకీ కనిపెట్టాలని అతని భార్య సునీత మంగళవారం హైదరాబాద్లో ప్రవాసీ ప్రజావాణిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్కి విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్కు …
Read More »ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడిరగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది. డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్ …
Read More »24 మందికి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా
జగిత్యాల, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం స్పందించింది. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న జీవో జారీ చేసింది. లాభోక్తుల ఎంపిక, చెల్లింపు కోసం అక్టోబర్ 7న మార్గదర్శకాల జీవో జారీ …
Read More »గల్ఫ్ వలసలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం
మానవ చలనశీలతపై చర్చ వాతావరణ మార్పులు – వలసలు, మానవ చలనశీలతపై ప్రభావం అనే అంశంపై అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సోమవారం జగిత్యాలలో చర్చా సమావేశం నిర్వహించింది. వాతావరణ మార్పుల వలన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల ఆరోగ్యంపై, పని ప్రదేశాల్లో పరిస్థితులపై ఎలాంటి ప్రభావం కలుగుతున్నది అనే విషయంపై చర్చ జరిగింది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అకాల వర్షాలు, వరదలు, కరువు …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికలో అక్రమాలు
జగిత్యాల, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన నిందితులు భోగ రాకేష్, చంద్ర శేఖర్ లను పోలీసులు అరెస్టు చేసినట్టు డిఎస్పి వెంకటస్వామి తెలిపారు.ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడిరచారు. భోగ రాకేష్ డీఈవో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడని, చంద్ర శేఖర్ మీసేవ ఆపరేటర్గా ఉన్నాడన్నారు. ఒక్కొక్క లబ్దిదారుని వద్దనుండి రూ. 5 వేల నుండి …
Read More »జేఈఈ అడ్వాన్సుడ్లో జగిత్యాల విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు
జగిత్యాల, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్ రెడ్డికి ఆలిండియా జనరల్ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి …
Read More »గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించొద్దు
జగిత్యాల, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించవద్దని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమంలో భాగంగా బుధవారం గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలతో గల్ఫ్ జెఏసి బృందం సమావేశమైంది. గల్ఫ్కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు …
Read More »ప్రవాసి ఇన్సూరెన్స్ లేకుండా ప్లయిట్ ఎక్కవద్దు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్తో సహా 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే వలస కార్మికులు రూ.325 చెల్లిస్తే 2 సంవత్సరాల కాలపరిమితి గల రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చు. ఎమిగ్రేషన్ యాక్టు-1983 నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లకముందే ఈ పాలసీని పొంది, ఇ-మైగ్రేట్ సిస్టంలో నమోదు చేసుకొని, ఎమిగ్రేషన్ …
Read More »జగిత్యాల జిల్లా వాసికి అరుదైన అవకాశం
జగిత్యాల, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీిలో ఈనెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్ (చర్చకుడు) గా ఆహ్వానించారు. తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్ డా. ఇ. గంగాధర్ కూడా సదస్సులో పాల్గొంటారు. అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్ నుండి …
Read More »