Kamareddy

రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల చోదకులు నిబంధనల ప్రకారం స్పీడులో వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం …

Read More »

పరీక్ష ఫీజులు తగ్గించాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్‌ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్‌ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్‌ ఫీజు అంటూ, ప్రాసెసింగ్‌ ఫీజు అంటూ, బయోమెట్రిక్‌ ఫీజు …

Read More »

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్‌ వద్ద కెసిఆర్‌ నగర్‌ పిఎస్‌ఆర్‌ కాలనీ’’ ఫేజ్‌ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే …

Read More »

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ పిఆర్‌ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్‌ బూర్గుల్‌ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్‌ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …

Read More »

కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య …

Read More »

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. చిరుధాన్యాలు …

Read More »

జిల్లా అభివృద్దికి అధికారులు తోడ్పాటునందించాలి

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో …

Read More »

ఆధునిక పద్దతులతో అధిక పాల ఉత్పత్తి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు అవలంబించి రైతులు అధిక పాలు ఉత్పత్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రైతులు పాలు పితికే యంత్రాలు ఉపయోగించాలని తెలిపారు. హైడ్రోఫోనిక్స్‌ గడ్డి పెంచే విధానం …

Read More »

న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఫాక్సో కోర్టు భవనంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవికి కళ్లద్దాలను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »