Kamareddy

కామరెడ్డిని పొగాకు రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు …

Read More »

బందుకు సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …

Read More »

కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. 1.50 లక్షల విరాళం

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు …

Read More »

నాటుసారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి ఎస్‌ రవీందర్‌ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు …

Read More »

ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బస్టాండ్‌ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్‌ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …

Read More »

ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …

Read More »

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …

Read More »

సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకొని లబ్దిపొందాలి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్‌ వినియోగం పై సమీక్ష …

Read More »

కామారెడ్డిలో క్రీడాపోటీలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్‌ హైస్కూల్లో తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఫస్ట్‌ జోనల్‌ రాజన్న జోన్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌. గేమ్స్‌ మీట్‌ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్‌ సిఎఫ్‌ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత, సిద్దిపేట్‌ జిల్లా డిఎఫ్‌వో శ్రీనివాస్‌, కరీంనగర్‌ జిల్లా డిఎఫ్‌వో గోపాల్‌ రావు, మెదక్‌ …

Read More »

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 526 గ్రామపంచాయతీలో మార్చి 15లోగా 100 శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నులను వసూలు చేసే విధంగా మండల స్థాయిలో ఎంపీవోలు, డివిజన్‌ స్థాయిలో డిఎల్పిఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »