Kamareddy

ప్రజావాణిలో 41 ఫిర్యాదులు

కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా …

Read More »

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్‌ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్‌ అసోసియేషన్‌) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్‌ కుమార్‌ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలురలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. …

Read More »

నిస్వార్థ సేవకులు రక్తదాతలే

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన కొండల్‌ రెడ్డి (45) ఓ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అవసరం కావడంతో ధర్మారావు పేట్‌ గ్రామానికి చెందిన సామల సంతోష్‌ రెడ్డి వెంటనే స్పందించి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి ప్లేట్‌లెట్స్‌ దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల …

Read More »

అయ్యప్ప ఆలయానికి వాటర్‌ ట్యాంక్‌ అందజేత

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయానికి శనివారం ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా అనిత పెళ్లి రోజు సందర్భంగా 20 వేల రూపాయల విలువైన స్టీలు వాటర్‌ ట్యాంక్‌ను అందజేశారు. వాటర్‌ ట్యాంకును అందజేసినందుకుగాను ఆలయ కమిటీ ప్రతినిధులు విశ్వనాథుల మహేష్‌ గుప్తా అనిత దంపతులను అభినందించారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా చేయాలని …

Read More »

ఈనెల 14 నుండి 18 వరకు వేలంపాట

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కొండాపూర్‌ గ్రామానికి చెందిన సోనా అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ మానవ దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర …

Read More »

నవంబర్‌ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం 49వ సారి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉప్పల్‌ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో ఓ నెగటివ్‌ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్‌ కిరణ్‌ కుమార్‌ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్‌ 11వ సారి రక్తదానం చేశారని రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ …

Read More »

ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ చౌరస్తా దగ్గర కెసిఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ …

Read More »

ముద్ద చర్మవ్యాధి రాకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముద్ద చర్మవ్యాధిపై అవగాహన గోడ ప్రతులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పశువైద్యాధికారులు గ్రామాల్లోని రైతులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »