కామరెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కుమ్మరి శాలివాహన కులాల కుటుంబాలకు కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి స్రవంతి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 148 ప్రకారం కుమ్మర శాలివాహన కులాల …
Read More »గ్రామ సభలపై విస్తృత ప్రచారం చేయాలి…
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 21 నుండి 24 వరకు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు), ఇందిరమ్మ ఇండ్ల జాబితాలపై జరిగే గ్రామ, వార్డు సభలకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని, గ్రామ సభల ఆమోదం పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో …
Read More »ప్రజావాణిలో 118 దరఖాస్తులు
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణి లో అర్జీలను సమర్పించడం జరిగిందని, అట్టి దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ …
Read More »కేపీఎల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కొత్తబాద్ క్రికెట్ జట్టు
బాన్సువాడ, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషణ్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో కొత్తబాధ్, బాన్సువాడ …
Read More »తలసేమియా చిన్నారికి రక్తం అందజేత…
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకి జుక్కల్ మండలానికి చెందిన ఓంకార్ 10 సంవత్సరాల బాలుడు తలసేమియాలతో బాధపడుతూ వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని ఐవిఎఫ్ యువజన విభాగం జగద్గిరిగుట్ట అధ్యక్షులు కాపర్తి నాగరాజు సాహరంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో పటోళ్ల జనార్దన్ రెడ్డి ఓ పాజిటివ్ రక్తాన్ని శనివారం అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ …
Read More »సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలు సమర్పించాలి
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని భూములను కలెక్టర్ పరిశీలించారు. క్యాసంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 330, 331, 332, 333 లలో గల 58 ఎకరాల భూములను పరిశీలించారు. ఇందులో 30 ఎకరాల భూమిని లే ఔట్ చేసి ఉందని, …
Read More »రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి…
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొద్ది సేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై చర్చించారు. 100 శాతం సర్వే చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ …
Read More »స్కానింగ్ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. డా.రవీందర్ నాయక్ గురువారం కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా ప్రగతి గురించి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు అమలు గురించి ప్రయివేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ గురించి సమీక్షించారు. ప్రతిఒక్క …
Read More »రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా …
Read More »అతివేగం ప్రమాదాలకు కారణం…
లింగంపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్త దాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం …
Read More »