Breaking News

    Kamareddy

    మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్‌

    కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ రేట్లు మంగళవారం మట్టి గణపతులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. మట్టి గణపతులను పెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని సూచించారు. తొమ్మిది రోజులపాటు మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    Read More »

    మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

    కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్‌ వేద ప్రకాష్‌ మాట్లాడుతూ హిందూ పండుగలు పర్యావరణానికి హాని కలిగించని విధంగా జరుపుకోవాలని, ప్లాస్టరాఫ్‌ పారీస్‌ వాడడం వల్ల వాటిని నీళ్లలో వేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆ …

    Read More »

    మా భూమిని కబ్జా చేశారు… న్యాయం చేయండి

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామ శివారులో గల 65 సర్వే నంబర్లు 4 ఎకరాల 5 గుంటల భూమి, 66 సర్వే నెంబర్‌లో 25 గుంటల గల భూమిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటగిరి కృష్ణమోహన్‌ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అదనపు …

    Read More »

    మగ్గం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతులందరూ మగ్గం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇడబ్ల్యుఆర్‌సి శిక్షణ సంస్థలో ఆర్‌ఎస్‌ఇటిఐ శిక్షణ సంస్థ ద్వారా మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. 35 మంది …

    Read More »

    రక్తదాత, అధ్యాపకుడు రమేష్‌ను అభినందించిన బాలు

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ బ్లడ్‌ ప్లేట్‌ లేట్స్‌ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్‌ అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో …

    Read More »

    ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం తగదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు …

    Read More »

    మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆభయ ఆంజనేయ ఆలయం, కల్కి నగర్‌ నందు వినాయక చవితి పండుగ సందర్బంగా 100 ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విగ్రహాల దాత కమిటీ సభ్యుడు కొత్త సంతోష్‌ కుమార్‌ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షులు అంభీర్‌ రాజేందర్‌ రావు, గంగ చరణ్‌, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

    Read More »

    అర్థశాస్త్రంలో డాక్టరేట్‌… అభినందనీయం..

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పాత నాగరాజు పర్యవేక్షణలో అర్థశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలును సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల కరస్పాండెంట్‌ …

    Read More »

    తేనెటీగల పెంపకంతో ఉపాధి

    కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోని రాశి వనంలో ఉన్న తేనెటీగల బాక్సులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. తేనెటీగల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

    Read More »

    పరీక్ష కేంద్రాల తనిఖీ

    కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్‌పి అన్యోన్య, చంద్రకాంత్‌, …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »