Breaking News

Kamareddy

నేటి మహిళలకు ఆతుకూరి మొల్లమాంబ ఆదర్శం

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆతుకూరి మొల్లమాంబను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి ప్రవీణ్‌ కుమార్‌ ప్రజాపతి అన్నారు. కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సంస్కృతంలో …

Read More »

మార్చ్‌ 28, 29న దేశవ్యాప్త సమ్మె

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 29 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్‌ బోస్‌ అన్నారు. సమ్మె పోస్టరును శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దుకై పోరాడుతామన్నారు. కనీస వేతనం …

Read More »

మాతృ మరణాల రేటును తగ్గించడానికి చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతృ మరణాల రేటును తగ్గించడానికి వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. హైరిస్క్‌ కేసులను గుర్తించి ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈసీజీ తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే 102 ఆంబులెన్స్‌లో జిల్లా …

Read More »

ఆయుష్‌ వైద్యశాల ఏర్పాటు కోసం భవన పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జిఓఎస్‌ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్‌ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. భవనం ఆయుష్‌ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, …

Read More »

పెండింగ్‌ ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

పొగ తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే వీలుంది

కామారెడ్డి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మెడికల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సిగరెట్‌, బీడీలు, పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే …

Read More »

పోలీసు అధికారులకు సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బిక్నూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఇటీవలే నూతనంగా వచ్చిన సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ తిరుపతయ్య, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆనంద్‌ గౌడ్‌లను ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. …

Read More »

బాలికల వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Read More »

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బేగంపేట్‌, రామంతపూర్‌లలో ఒకటో తరగతి ప్రవేశం కొరకు అర్హులైన గిరిజన విద్యార్థి, విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ఆధ్వర్యంలో ఓ చిన్నారితో (లాటరీ) లక్కీడ్రా తీయించారు. ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు మొత్తం ఐదుగురు …

Read More »

రక్తదానంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం..

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలలో ఆపరేషన్‌ నిమిత్తమై నిజాంసాగర్‌ మండలానికి చెందిన సుజాతకు కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన స్వామి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »