కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూరియా పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన యూరియాను …
Read More »అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకుడు
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ బి పాజిటివ్ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డిని ఫోన్లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ను సంప్రదించగా మిత్రుడు …
Read More »మోడీ ప్రభుత్వానికి కామారెడ్డి రైతుల కృతజ్ఞత
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సింగీతం గ్రామానికి చెందిన మహేశ్వరి (36) ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం ఎల్లారెడ్డిలో అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ కుమార్ వారి కుమారుడు సాయి ప్రణీత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆపదలో ఉన్న మహిళకు సకాలంలో రక్తాన్ని అందజేసి …
Read More »వేడుకలు ఘనంగా నిర్వహించాలి…
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు. హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐసిడిఎస్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన …
Read More »యూరియా వచ్చింది… రైతుల హర్షం…
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలంలోని కరడ్ పల్లి గ్రామంలో యూరియా సమస్య ఉన్నదని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్ ఆదివారం ప్రత్యేక యూరియాతో కూడిన రెండు లారీలను పంపిస్తున్నాను అని తెలిపారు. అలాగే రైతుల సమస్యలు తెలుసుకొని యూరియాను పంపిస్తాం అన్నందుకు గ్రామ రైతులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డికి, మండల …
Read More »రేషన్ బియ్యం పట్టివేత
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ రేషన్ బియ్యం ఉంచిన కిరాణ వర్తకుడు కొమ్మ రమేష్ వద్ద నుండి దాదాపు నాలుగు కింటళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు రామారెడ్డి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అట్టి బియ్యం బస్తాలను సీజ్ చేశామని చెప్పారు.
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు సక్రమంగా చేపట్టాలి
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కోరారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి నుంచి భూంపల్లి వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్లో ఉన్న మొక్కలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. భూంపల్లి …
Read More »ఎంపివో సస్పెండ్
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్ మండల పంచాయతీ అధికారి లక్పతి నాయక్ను శనివారం సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవోను …
Read More »మానవత్వానికి ప్రతిరూపాలు రక్తదాతలు..
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడుతున్న లక్ష్మీ (38)మహిళకు అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రానికి చెందిన ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కామర్స్ అధ్యాపకులు రమేశ్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »