కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్ రాజేందర్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్ సైట్ ప్రెసిడెంట్ బానోత్ …
Read More »పట్టాలు పొందిన లబ్దిదారుల వివరాలు సేకరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు పట్టాలు పొందిన లబ్ధిదారుల సమగ్ర వివరాలను మండల స్థాయి అధికారులు సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మండల స్థాయి అధికారులతో గిరి వికాసం పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు నుంచి అయిదుగురు వరకు ఈ పథకంలో …
Read More »అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని వినాయకుడికి వినతి
భిక్కనూరు, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ …
Read More »అక్టోబర్ 4న తుది జాబితా
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 వరకు వచ్చే అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరోల్ ను ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …
Read More »అనీమియాతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి …
Read More »పొరిటిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఆగస్టు 2023 నెలకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కార్డుదారులకు సూక్ష్మ పోషకాలను అందించే ఉద్దేశంతో పొరిటిఫైడ్ బియ్యం అనగా పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యమని అర్థం. పొరిటిఫైడ్ బియ్యంలో మూడు అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ -12 లు …
Read More »గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు సుఖశాంతులను అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, …
Read More »బిఎల్వోల పాత్ర కీలకం
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులలో బీఎల్వోలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆదివారం బూత్లెవల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి పేరును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి …
Read More »ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయులకు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరిక …
Read More »మట్టి వినాయకులు పంపిణి చేసిన జిల్లా న్యాయమూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణ కాలుష్యాన్ని అరికడుదాము అనే నినాదంతో ‘‘రామకృష్ణ మెడికల్’’ సహకారంతో మట్టి వినాయకులను కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి యస్.యన్. శ్రీదేవి చేతుల మీదుగా అడ్వొకేట్స్, కోర్ట్ సిబ్బంద్దికి పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ గోపాల్ …
Read More »