కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన భాద్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26,27, సెప్టెంబర్ 2,3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ …
Read More »వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.
Read More »అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సేవలు మరువలేనివి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతటి క్లిష్ట సమస్యలనైనా బ్యాలెన్స్ చేస్తూ ఓపికతో పరిష్కరిస్తూ వివిధ రంగాలలో జిల్లాను అభివృద్ధిపథంలో పయనించుటలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా వెంకటేష్ దోత్రే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశమందిరంలో మహబూబ్నగర్ జిల్లాకు బదిలీపై వెళ్లిన వెంకటేష్ దోత్రేకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన సాప్ట్వేర్ ఇంజనీర్
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్లోని నిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై రాజలక్ష్మికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్కు తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని …
Read More »ఓటర్ల జాబితా పకడ్బందీగా రూపకల్పన చేయాలి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు వచ్చిన ప్రతి …
Read More »మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాదించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్లో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల, తేనెటీగల, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, …
Read More »శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను వారిపిల్లలు సరిగ్గా తిండి పెట్టకుండా ఇంట్లో నుండి పంపిస్తున్నారు. చాలామంది ఆకలితో అలమటిస్తూ పస్తులు ఉంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్ మరియు అనేక దేవాలయాల వద్ద కడుపు నింపుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు కనీసం తినడానికి తిండి లేక కాళీ కడుపుతో పస్తులుంటున్నారు. ఇలాంటి వారి కోసం శ్రీ గంగాసాయి ఫౌండేషన్ …
Read More »మైనార్టీ బాలుర పాఠశాలలో అడ్మిషన్లు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలలో అడ్మిషన్లు ఉన్నాయని, 5వ, 6వ, 7వ, 8వ, 9 వ తరగతులల్లో ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ బాలురకు స్పాట్ అడ్మిషన్ ఇస్తున్నామని ప్రిన్సిపల్ పి. నారాయణ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత ద్రువీకరణ పత్రాలు తీసుకువస్తే నేరుగా …
Read More »18న మత్స్య సంఘాల అధ్యక్షుల సమావేశం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో నూతనంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘమును రిజిస్ట్రేషన్ చేయుట గురించి ఈనెల 18 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి వీక్లీ మార్కెట్ సమీపంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాలులో జిల్లాలోని అన్ని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి …
Read More »బోనాలపండగ సందర్భంగా ప్రజావాణి లేదు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణి కార్యక్రమం జరపడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Read More »