nandipet

కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు

నందిపేట్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, మారంపల్లి పద్మశాలీ సంఘం భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి మంగళవారం వెల్లడిరచారు. నందిపేట్‌ మండలానికి చెందిన గౌడ సంఘం, పద్మశాలి సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ వెళ్ళి …

Read More »

తెలంగాణ వచ్చాకే మండలాల అభివృద్ధి

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవనరెడ్డి అన్నారు. డొంకేశ్వర్‌ మండల ఏర్పాటుతో చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్ముర్‌ నియోజక వర్గంలోని అలూరు, డొంకేశ్వర్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేయగా గత నెలలో ఆలూరులో మండల కార్యాలయన్ని ప్రారంభించినప్పటికి డొంకేశ్వర్‌లో అనివార్య కారణాల వల్ల వాయిదపడిరది, …

Read More »

నందిపేట్‌ మండలానికి ఫైర్‌స్టేషన్‌ మంజూరు

నందిపేట్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్‌స్టేషన్‌ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్‌ స్టేషన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్‌ మండల కేంద్రంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి …

Read More »

నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్‌లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్‌ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్‌ ఎస్‌ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్‌ పేర్కొన్నారు. నందిపేట్‌ గ్రామంలో గల నాలుగు మజీద్‌ల వద్ద మజీద్‌ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు …

Read More »

ధాత్రి టౌన్‌ షిప్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌ ను ఆదివారం అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …

Read More »

డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి

మాక్లూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్‌ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్‌ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు …

Read More »

జాలరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో బోయిగల్లికి చెందిన గూండ్ల గణేశ్‌ ఈనెల 26న చేపలు పట్టడానికి వెళ్ళి 27న సాయంత్రం తాళ్ళ చెరువులో శవమై కనిపించాడని నందిపేట్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

జిఓ 59 క్రమబద్దీకరణకు స్థలాలు పరిశీలించిన ఆర్‌డిఓ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్‌ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస్‌ …

Read More »

పలుగుట్ట భూమి పరిరక్షణే ద్యేయం…

నందిపేట్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ, పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్‌ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇచ్చారు. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి …

Read More »

ముస్లిం కమిటీ అధ్యక్షునికి సన్మానం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన ఆహ్మద్‌ ఖాన్‌ను టిఆర్‌ఎస్‌ మైనారిటీ సెల్‌ ఆర్ముర్‌ నాయకులు శనివారం శాలువ, పూలమాలతో సన్మానించారు. ఇటీవల నందిపేట్‌ గ్రామంలోని అన్ని మజీద్‌ సభ్యుల సమక్షంలో ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గాన్ని మరియు అధ్యక్షునిగా ఆహ్మద్‌ ఖాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఉస్మాన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »