Constituency News

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత యాద్రుచ్చికరణ (ర్యాండమైజెషన్‌) ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరెట్‌లోని ఎన్‌.ఐ.సి హాల్‌లో కౌంటింగ్‌ పరిశీలకులు చిఫంగ్‌ ఆర్థుర్‌ వర్చుయో, జగదీశ్‌, అభయ్‌ నందకుమార్‌ కరగుట్కర్‌ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను …

Read More »

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో డిసెంబర్‌ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …

Read More »

మద్యం పట్టివేత

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి నుండి 73 బ్లెండర్స్‌ ప్రైడ్‌ మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని వీటి విలువ 39 వేల 454 రూపాయలు ఉంటుందని ఎక్సెస్‌ సీఐ యాదగిరిరెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై తేజస్విని, విట్టల్‌, సిబ్బంది శ్రీకాంత్‌, నాగరాజు తదితరులు …

Read More »

యెండల లక్ష్మినారాయణపై దాడి

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం బాలుడికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం బూరుగిద్ద ఎల్లమ్మ తండా చెందిన మనోజ్‌ కుమార్‌ (10) గురుకుల పాఠశాల విద్యార్థికి ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో వారికి కావాల్సిన రక్తము లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

రెండు రోజులు కీలకం…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ అధికారులు ఈ.వి.ఏం. యంత్రాలను, పోలింగ్‌ మెటీరియల్‌ను చెక్‌లిస్ట్‌ ప్రకారం సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బుధవారం జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను పరిశీలించి పోలింగ్‌ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు …

Read More »

శతశాతం ఓటు వేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు నైతిక బాధ్యతగా శతశాతం ఓటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై, విస్తృతంగా అవగాహన …

Read More »

ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్‌ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …

Read More »

ముందస్తు అనుమతి పొందాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలలో కామారెడ్డి, జుక్కల్‌, ఎలారెడ్డి నియోజక వర్గాల నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 29, 30 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుండి ముందస్తు …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్‌ లో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన బి నెగిటివ్‌ రక్తదాత ఉమేష్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »