డిచ్పల్లి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య.యం యాదగిరి వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్ చాంబర్లో ఆచార్య ఎం యాదగిరి యాంటీ ర్యాగింగ్ పోస్టర్ను విడుదల చేస్తూ విద్యార్థులు శారీరిక, మానసిక, లైంగిక, ఒత్తిడికి గురి చేస్తే చట్టరీత్యా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి సమాజానికి ఉపయోగపడేలా …
Read More »సోమవారం 14 నామినేషన్లు
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 14 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్ నియోజక వర్గంలో బిజెపి నుండి అరుణ తార, ఎల్లారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా మైతారి సంజీవులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు. …
Read More »నామినేషన్ పత్రాలు ఎలా రాయాలి…
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా నామినేషన్ పత్రాలు నింపడంలో అభ్యర్థులు తగు సలహాలు, సూచనలు అందించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి తహసీల్ధార్ కార్యాలయం నందు ఫెసిలిటేషన్ సెంటర్ (హెల్ప్ డెస్క్) లో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »జాతీయస్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థిని
బాన్సువాడ, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడలో జాతీయస్థాయి పోటీలకు బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాల విద్యార్థిని సృజన ఎంపికైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 3, 4, 5 తేదీలలో అండర్ 19 ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట్ జిల్లాలోని గజ్వేల్ బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడలకు పాఠశాల నుండి …
Read More »శిక్షణా తరగతులకు హాజరుకాని వారికి షోకాజు నోటీసులు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్ కంట్రోల్ రూమ్ను సందర్శించి నోడల్ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్ అధికారులు, …
Read More »అనుమతులు లేకుండా ప్రకటనలు వేయరాదు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్, మానిటరీ కమిటీ కంట్రోల్ రూమ్ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఓటర్ హెల్ప్ లైన్, సి విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో వచ్చిన ప్రకటనల వివరాలు అడిగారు. వచ్చిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు …
Read More »స్వచ్ఛ కాలనీ కోసం ఉత్సాహంగా…
ఆర్మూర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 23వ వారం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు. కాలనీ వాసులు పారలు, కర్రల సాయంతో మురుగు …
Read More »భారీగా కాంగ్రెస్లో చేరిన ప్రజాప్రతినిధులు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ ఎత్తున లింగంపేట జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి మదన్మోహన్ ఆహ్వానించారు. లింగంపేట జడ్పిటిసి ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి, మోతె సర్పంచ్ రాంరెడ్డి, మోతె ఉప సర్పంచ్ బుయ్య స్వామి, మోతె వార్డ్ మెంబర్లు జెలందర్, …
Read More »ఖుదావన్పూర్లో ఉచిత వైద్య శిబిరం
నందిపేట్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపెట్ మండలం కుధ్వాన్పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్ తీయటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి …
Read More »శనివారం ఏడు నామినేషన్లు
కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల స్వీకరణ రెండవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరు నామినేషన్లు, జుక్కల్ నియోజక వర్గంలో ఒక నామినేషన్ దాఖలు కాగా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేవని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వంత్ర అభ్యర్థులుగా …
Read More »