Constituency News

ఎన్నికల అధికారులకు కీలక సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసీల్ధార్లు, ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌ కేంద్రాలను రూట్‌ వారీగా పరిశీలించి పోలింగ్‌కు అనువైన గదిని ఎంపిక చేసి సిద్ధంచేసేలా చూడవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ప్రధానంగా పోలింగ్‌ కేంద్రాలు గ్రౌడ్‌ ఫ్లోర్‌లోనే ఉండేలా చూడాలని, ఫర్నీచర్‌, విద్యుత్తూ, మంచినీరు, టాయిలెట్స్‌ ర్యాంప్‌ సౌకర్యాలతో పాటు వీల్‌చైర్‌ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. …

Read More »

మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి

కామరెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వివి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి అయిన పిదప స్ట్రాంగ్‌ రూమ్‌లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక …

Read More »

వీర జవాన్‌ కుటుంబానికి భరోసా

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద ప్రమాదంలో వీర మరణం పొందిన నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నీరడి గంగాప్రసాద్‌ కుటుంబానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని అయన స్వగృహంలో వీర మరణం పొందిన గంగాప్రసాద్‌ కుటుంబ సభ్యులు గురువారం సభాపతిని …

Read More »

స్టూడెంట్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టూడెంట్‌ మ్యానిఫెస్టోను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల న్యూస్‌ సెమినార్‌ హాల్లో ఏబివిపి ఆధ్వర్యంలో స్టూడెంట్‌ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చారు. …

Read More »

ముగ్గురు వ్యక్తుల నుండి నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల నుండి 2 లక్షల 90 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు డి.ఎస్‌.పి జగన్నాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి జగనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం సరిహద్దుల వద్ద పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు …

Read More »

పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా రిటర్నింగ్‌ అధికారులు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గురువారం ఎస్పీ సింధు శర్మతో కలిసి యెల్లారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాలలో …

Read More »

ఎన్నికల అధికారులకు శిక్షణ

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ నిర్వహణ, ఈ.వి.ఏం. ల పై అవగాహన పొందిన మాస్టర్‌ ట్రైనీలు నియోజక వర్గ స్థాయిలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు తగు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాస్టర్‌ ట్రైనీలు, నోడల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు …

Read More »

కామారెడ్డిలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మహిళలకు సూచించారు. స్వీప్‌ కార్యక్రమాలలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, సాయంత్రం స్వీప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్వీప్‌ బతుకమ్మను మహిళలకు అందజేస్తూ పూలను …

Read More »

తాడ్కొల్‌ చౌరస్తాలో నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్‌ చౌరస్తా, బీర్కుర్‌ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, …

Read More »

వృధాగా పోతున్న మిషన్‌ భగీరథ నీరు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొట్టారుమూరులో గల విశాఖ కాలనీలో రోడ్డు నెంబర్‌ 6 వద్ద గత 20 రోజుల నుండి మిషన్‌ భగీరథ పైపు పగిలిపోయి నీరు కలుషితం అవుతుంది. కావున అధికారులు దీనిని సరిచేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »