Breaking News

    Constituency News

    ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం

    బాన్సువాడ, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …

    Read More »

    అక్టోబర్‌ 2న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 న అన్ని చికెన్‌, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్‌ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ దేవేందర్‌ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    Read More »

    జైలు బెయిలు

    అరెస్టు చేసి విచారణ కాలంలో సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కచ్చితంగా హక్కుల ఉల్లఘన అవుతుంది. గతంలో జగన్‌ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ రాజకీయ నాయకుల అవినీతిని సమర్థించలేం. అవినీతికి పాల్పడిన వ్యక్తుల పట్ల ఉదాసీనతని సహించలేం. చట్టపరిధిలో కేసులు నమోదు చేసి నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే అవినీతి కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి …

    Read More »

    మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే …

    Read More »

    ఆశా వర్కర్ల సమ్మెకు రాజారెడ్డి మద్దతు

    బాన్సువాడ, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆశా వరకర్ల సమ్మెకు పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో వారి డిమాండ్‌లకు సంపూర్ణ మద్ధతునిచ్చారు. డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని, బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వారిని పలకరించకపోవడం …

    Read More »

    వ్యాధి బారిన పడకుండా టీకాలు వేయించాలి

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంపుడు జంతువులు రాబిస్‌ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్‌ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. లూయిస్‌ పాశ్చర్‌ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28 న ప్రపంచ రాబిస్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్‌ …

    Read More »

    వినాయక నిమజ్జనంలో అపశృతి

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. స్థానికంగా రెబల్‌ స్టార్‌ గణేష్‌ మండలి ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళుతుండగా బుధవారం ఉదయం నరేష్‌ (35) అనే యువకుడు డిజె సౌండ్‌ భరించలేక …

    Read More »

    దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు

    బాన్సువాడ, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 17రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడి ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి అంగన్వాడి ఉద్యోగులను …

    Read More »

    పీఆర్టీయు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా గోపాల్‌

    ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పీఆర్టీయు సీనియర్‌ కార్యకర్త ప్రస్తుతం పీఆర్టీయు రూరల్‌ అధ్యక్షులు ఇట్టెం గోపాల్‌ను పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతితో పీఆర్టీయు నిజామాబాద్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుధవారం నియమించారు. జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్‌ రెడ్డి ఇట్టెం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇట్టెం గోపాల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో …

    Read More »

    జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

    కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్‌ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »