Constituency News

దళితరత్న అవార్డు అందుకున్న చేపూర్‌ సర్పంచ్‌

ఆర్మూర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్నకు మంగళవారం రోడ్డు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేతులమీదుగా దళిత రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్బంగా చేపూర్‌ గ్రామంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు ఆయనను యువజన సంఘాలవారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ సాయన్న మాట్లాడుతూ తాను దళిత రత్న అవార్డు మంత్రి చేతులమీదుగా అందుకోవడం …

Read More »

ఆగష్టులో గ్రూప్‌ 2 పరీక్ష

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ -2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీల్లో జరుగుతోందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. జూమ్‌ మీటింగ్‌ ద్వారా బుధవారం కామారెడ్డి కలెక్టర్‌ నుంచి టీఎస్పీఎస్‌ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 వేల 881 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని …

Read More »

అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితా

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో 2వ ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం-2023, ఓటర్‌ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని …

Read More »

గిరిజన గురుకులాల్లో పార్ట్‌ టైం ఉపాధ్యాయుల భర్తీ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్‌ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్‌ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు. బాలిలకల పాఠశాలల్లో మహిళలు …

Read More »

విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ

బాన్సువాడ, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇబ్రహీంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రామ సర్పంచ్‌ నారాయణ రెడ్డి నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటుబుక్స్‌ అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వ …

Read More »

గ్రామపంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

ఎడపల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్‌, జంగం గంగాధర్‌ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ …

Read More »

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

సదాశివనగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్‌ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు రైతులు కలిసి రేవంత్‌ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్‌ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. …

Read More »

గల్ఫ్‌లో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ది రాములు, గత కొన్ని రోజుల క్రితం గల్ఫ్‌ దేశంలో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట రామారెడ్డి జెడ్పిటిసి నారెడ్డి మోహన్‌ రెడ్డి, పోసానిపేట్‌ సర్పంచ్‌ …

Read More »

దోమతెరల పంపిణీ

బోధన్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు మంగళవారం దోమ తెరలు పంపిణి చేశారు. ఇందులో భాగంగా బోధన్‌ పట్టణం అజాంగంజ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి దోమతెరలు పంపిణీ చేశారు. వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కవగా వస్తాయి కాబట్టి చిన్న పిల్లలను దోమకాటు వ్యాధుల …

Read More »

ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »