Constituency News

నందిపేట్‌లో ఘనంగా విద్యా దినోత్సవం

నందిపేట్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉర్దూ పాఠశాలలో విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , మువ్వన్నల జండాను ఎగరవేయడం జరిగింది, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో, పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంబారు తిరుపతి …

Read More »

కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభుత్వ మరింత దృష్టి పెట్టిందని తెలిపారు. తరగతి గదుల్లోని విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించుకునే వీలుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల …

Read More »

జుక్కల్‌లో ఆక్సీజన్‌ పార్కు ప్రారంభం

జుక్కల్‌ జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్లో ఆక్సిజన్‌ పార్కును సోమవారం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ప్రారంభించారు. రుర్బన్‌ పథకం కింద ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ పార్కును ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జుక్కల్‌ గ్రామ యువకులు ఈ పార్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే మాట్లాడారు. జిల్లా …

Read More »

పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఏంపీ బీబీ పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం మంగుళూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హరితోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అధికారులు మొక్కలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 8847 మంది విద్యార్థులకు గాను 8221 మంది హాజరయ్యారని, 620 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 10,461 మంది నమోదు చేసుకోగా 9699 …

Read More »

డిగ్రీ పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు చెందిన ఈనెల 20న జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసామని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షలు జూలై 3వ తేదీన జరుగుతాయని …

Read More »

చిన్నారికి రక్తం అందజేత

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

ఆధార్‌ నమోదు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కొత్త బాద్‌ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ప్రిన్సిపల్‌ ఫకీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు ఆదరణ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులు మరియు పది సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌ చేయడం జరుగుతుందని కావున …

Read More »

క్రికెట్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కునేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ యువకులకు క్రికెట్‌ కిట్లను స్థానిక సర్పంచ్‌ రోడ్డ విజయలింగం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడాలో నైపుణ్యాన్ని పొందాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు క్రికెట్‌ కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీరడి సాయిలు, బిఆర్‌ఎస్‌ గ్రామ …

Read More »

జేఈఈ అడ్వాన్సుడ్‌లో జగిత్యాల విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు

జగిత్యాల, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్‌ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్‌ రెడ్డికి ఆలిండియా జనరల్‌ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌ గా హైదరాబాద్‌ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »