కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు రావద్దని పేర్కొన్నారు.
Read More »గురుకులాల్లో ప్రవేశాల గడువు పొడగింపు
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయసంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోజ్ శనివారం వెల్లడిరచారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను …
Read More »జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్నాథ్ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక …
Read More »చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతోందని జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యములో దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల ఉత్పత్తుల మేళా నిర్వహించారు. శనివారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »హైమ్యాక్స్ లైటింగ్స్ ప్రారంభించిన ఎంపీపీ, జడ్పీటీసీ
రెంజల్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ నిధుల ద్వారా మంజూరైన రూ: లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో గాంధీ విగ్రహం వద్ద నిర్మించిన హైమ్యాక్స్ లైటింగ్ ను ఎంపీపీ రజిని కిషోర్, జెడ్పిటిసి విజయ సంతోష్ స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్లతో కలిసి శనివారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అత్యాధునిక …
Read More »సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎంపీపీ
రెంజల్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో శనివారం సీసీ డ్రైనేజీ పనులను ఎంపీపీ రజినీ కిషోర్,జడ్పీటీసీ మేక విజయ సంతోష్, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పీ నిధుల ద్వారా మంజూరైన రూ:5 లక్షలు,మండల పరిషత్ ద్వారా మంజూరైన రూ:3 లక్షలతో మంజూరైన సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.నాణ్యత …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూర్ గ్రామానికి చెందిన రాజమణి (45) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపేట్ గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కేబీసీ రక్త నిధి కేంద్రంలో …
Read More »దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సుపరిపాలన సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గతంలో రెండు లైన్ల రోడ్లు ఉండగా వాటిని నాలుగు లైన్ల రోడ్లుగా మార్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మారుమూల గ్రామాల ప్రజలు వెళ్లాలంటే …
Read More »గల్ఫ్ జెఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి రెడ్డి
ఆర్మూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలను గుర్తించి మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ పట్కూరి తిరుపతి రెడ్డిని గల్ఫ్ జెఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. శనివారం ఆర్మూర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తిరుపతి రెడ్డికి నియామక పత్రం …
Read More »ఎక్కువమందికి పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే 11 వేల …
Read More »