ఆర్మూర్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ డివిజన్ ఏసిపి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఇప్పటినుంచి తమ లక్ష్యం ఎంచుకొని లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలని …
Read More »ఆదర్శం… జర్నలిస్ట్ కాలనీ
ఆర్మూర్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటూ జర్నలిస్ట్ కాలనీవాసులు ఆర్మూర్కు ఆదర్శంగా నిలుస్తున్నారని పురపాలక చైర్ పర్సన్ పండిత్ వినీత ప్రశంసించారు. జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాలనీవాసులతో కలిసి ఆమె ఉద్యానవనంలో పిచ్చిమొక్కలను …
Read More »ఆర్మూర్లో ఘనంగా సావర్కర్ జయంతి
ఆర్మూర్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ …
Read More »18న క్విజ్ పోటీలు
బాన్సువాడ, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్స్వాడ పట్టణంలో యూత్ డిక్లరేషన్లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్గాంధీ యూత్ డిక్లరేషన్ క్విజ్ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్ కాంపిటీషన్ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్, …
Read More »ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
ఆర్మూర్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బీజేపీ ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆర్మూర్ మండల అధ్యక్షులు తొర్తి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ పాలెం రాజు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే 2018 ఎన్నికల …
Read More »ఘనంగా ఉత్సవాలు
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2న నుంచి 22 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జూన్ 2న జరిగే …
Read More »ముందస్తుగా పంట వేయడమే మార్గం
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిణమించిన ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను అధిగమించేందుకు ముందస్తుగా పంట వేసుకోవడం ఉత్తమ మార్గమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. వానాకాలం పంటను జూన్ మొదటి వారం నాటికే విత్తుకోవాలని, యాసంగి పంటను మార్చి నెల 15వ తేదీ లోపు నాటడం పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనివల్ల …
Read More »తెలంగాణ జి.కె.
రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి
Read More »వేణుగోపాల్కు గౌరవ డాక్టరేట్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్కు శనివారం తమిళనాడులోని హోసూర్లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఫౌండర్ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్ చైల్డ్, కన్నడ ఫిలిమ్ యాక్టర్ హెచ్. ఏం. మీనాక్షి చేతుల మీదుగా …
Read More »నకిలీ విత్తనాలు అమ్మితే ఉపేక్షించం
బాన్సువాడ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్ ఫోర్స్ అధికారి బిచ్కుంద ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవకాశాన్ని ఆసరాగా …
Read More »