Constituency News

ఒలంపియాడ్‌ లెవల్‌ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి ఐఎన్‌ టిఎస్‌ ఓ ఒలంపియాడ్‌ లెవల్‌- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్‌ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్‌, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్‌ …

Read More »

కామారెడ్డి డాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు

కామరెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా కామారెడ్డి జిల్లా డాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ లో జరిగినటువంటి తెలంగాణ డ్యాన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి మరియు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా కమిటీలను నియపిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు …

Read More »

యువకుని రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శిరీష (23) కు అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్త నిధి కేంద్రాలలో దొరకపోవడంతో పట్టణంలోని ఈశ్వర్‌ దాస్‌ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని డాక్టర్‌ బాలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతకు …

Read More »

ఉపాధి పనులను పరిశీలించిన వైస్‌ ఎంపీపీ

రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులను వైఎస్‌ ఎంపీపీ క్యాతం యోగేష్‌ పరిశీలించారు. గ్రామంలోని చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించి చేసిన పనులకు ఖచ్చితమైన కొలతతో కూడిన డబ్బులు ఇవ్వాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు సూచించారు. ఎండలు ఎక్కువగా సమీపిస్తుండడంతో పని ప్రదేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తాగునీటి సమస్యను లేకుండా చూడాలని సూచించారు.ఈ …

Read More »

సాటాపూర్‌లో ముగిసిన కంటివెలుగు

రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెల 14న మండలంలోని సాటా పూర్‌ గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్‌ వికార్‌ పాషా తెలిపారు. సోమవారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్‌ వికార్‌ పాషా …

Read More »

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని విండో చైర్మన్‌ భూమరెడ్డి,సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు.సోమవారం దూపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే …

Read More »

పంచాయతీల సంపద పెంపొందించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని కాంపోస్టు షెడ్లు వినియోగించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి పంచాయతీల సంపదను పెంపొందించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో …

Read More »

మండలాల వారిగా బస్సులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే …

Read More »

విద్యార్థులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయిలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా నేర్పాలన్న ఉద్దేశంతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మికి కామారెడ్డి జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి తాడ్వాయి శ్రీనివాస్‌ అందజేశారు. ఇందులో భాగంగా పరోపకారం, దేశభక్తి విద్యార్థుల్లో నీతి, నిజాయితీ పెంపొందించుటకు మూగజీవుల పట్ల సేవా మరియు ప్రకృతి, చెట్ల సంరక్షణ, …

Read More »

కామారెడ్డిలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నికలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం గర్గుల్‌ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పిట్లం అనుమాండ్లు ఆచార్యులు, నాగభూషణమాచారి, దేవిప్రసాదచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షులుగా శిర్లవంచ కృష్ణమా చార్యులు, ఉపాధ్యక్షులు దేవర కొండ నరేష్‌ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి కొండ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »