కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »రూపాయి ఖర్చు లేకుండా
కామారెడ్డి, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరై మాట్లాడారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే …
Read More »ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులపై సమీక్ష
కామారెడ్డి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్, విద్యుత్తు, ఆర్అండ్బి, రెడ్ కో అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్తు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం వంటి …
Read More »ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇవిఏం గోదామును గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈవీఎం గోదాంలో 1429 బ్యాలెట్ యూనిట్లు, 1117 కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఈవీఎం కేంద్రం తాళంను తీయించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు పనితీరును పరీక్ష చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డిఓలు …
Read More »స్టడీ మెటీరియల్ అందజేత
బీబీపేట్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న 6 గురు నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ …
Read More »అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం…
ఆర్మూర్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం పోషణ్ అభియాన్ పోషణ పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి 15 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తామని నిర్వాహకురాలు అరుంధతి తెలిపారు. అంగన్వాడి బోధకురాలు అరుంధతి …
Read More »వేలం ద్వారా భారీ ఆదాయం
కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని 50 ప్లాట్లు, 11 గృహాలు వేలం పాట ద్వారా విక్రయించడం ద్వారా రూ.7.92 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టరేట్ ఏవో రవీందర్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల వేలం కార్యక్రమానికి మంగళవారం హాజరై మాట్లాడారు. మంగళవారం 12 ప్లాట్లు, నాలుగు గృహాలు వేలం వేయగా రూ.2.9 కోట్ల ఆదాయం …
Read More »నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నీటి ఎద్దడి నివారణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు …
Read More »విద్యా సమాచారం…
హైదరాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 3 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆదేశించారు. మార్చి నెల 24 నుంచి వెబ్సైటులో టెన్త్ హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సంవత్సరం 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు. టెన్త్ పరీక్షల కోసం సీసీ …
Read More »21వ తేదీ వేలం చివరి రోజు
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ఉన్న వివిధ దశల్లో నిర్మాణం పూర్తయిన గృహాల వేలంకు రేపు చివరి రోజు అని కలెక్టరేట్ ఏవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ధరణి టౌన్షిప్లోని గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేలం పాటలో 11 ఫ్లాట్లు, ఏడు గృహాలు విక్రయించగా రూ.2.35 కోట్ల …
Read More »