Constituency News

పోస్టల్‌ బీమా పాలసీలపై అవగాహన

ఆర్మూర్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్‌ కల్పిస్తున్న విధానాన్ని, …

Read More »

అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు డాక్యుమెంట్లు, మొబైల్‌ నెంబర్‌ అప్డేట్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్‌ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్‌ అప్డేట్‌ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నెంబర్ను అప్డేట్‌ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే …

Read More »

పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ భవనాలకు …

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.

Read More »

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

రెంజల్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్‌ లీకేజ్‌ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్‌ యాదవ్‌ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్‌ …

Read More »

అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్‌ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్‌ స్టేషన్‌ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్‌ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు సబ్‌ స్టేషన్‌ పనులు …

Read More »

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్‌, నాగార్జున, శివ, సుధీర్‌, సాయిబాబా, ప్రిన్సిపాల్‌ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …

Read More »

నేటి విద్యార్థే రేపటి భావితరాలకు మార్గదర్శకులు

రెంజల్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్‌ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్‌ సేవ సంస్థ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం

బోధన్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నిజాం షుగర్‌ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన హాత్‌ సే హాత్‌ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »