బీమ్గల్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. …
Read More »పీకల్లోతు అవినీతిలో తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాలయం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 150 మంది ఉద్యోగులను నియమించడం చట్ట విరుద్ధమని …
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం..
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి …
Read More »ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో …
Read More »అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »తాడ్ బిలోలిలో శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమిపూజ
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందియమన్నారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా ఏర్పడి గ్రామంలో శివాజీ విగ్రహం …
Read More »జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని రెంజల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్,సంతోష్ కోరారు. బుధవారం తహసిల్దార్ రాంచందర్ కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిలో ఏళ్ల తరబడి నుండి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ పనిచేస్తూన్న తమకు నివాసాల కోసం ప్లాట్లు అందజేయాలని …
Read More »ప్రజా పంథానే జనతా ప్రజాతంత్ర విప్లవ మార్గం
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజాపంథ మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెంజల్ మండలం తాడ్ బిలోలి, బోర్గం, నీలా గ్రామాల్లో బుధవారం ప్రజాపంథా జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు అందజేసిన స్పీకర్
బాన్సువాడ, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన బసిరెడ్డి సుదర్శన్ రెడ్డికి రెండు లక్షలు, మంద హన్మండ్లు 17 వేల 600 చెక్కులను బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ నాయక్, ఏజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గోపనపల్లి సాయిలు, మన్నే …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో, మల్దకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …
Read More »