బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్ఎస్ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …
Read More »ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య …
Read More »హెల్త్ సెంటర్ను సందర్శించిన ఉన్నత విద్య మండలి చైర్మన్
డిచ్పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …
Read More »జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ …
Read More »రక్తదాతలు ప్రాణదాతలే..
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్లో నాలుగు కేసులు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి దేవునిపల్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించడం జరిగిందని దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని …
Read More »భూగర్భ జలాలను పెంపొందించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్ ఫండ్స్ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »ఒత్తిడిని అధిగమిస్తే మంచి గ్రేడిరగ్ పొందవచ్చు
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. …
Read More »ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి …
Read More »