Constituency News

జిల్లా అభివృద్దికి అధికారులు తోడ్పాటునందించాలి

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో …

Read More »

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఆర్మూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుదవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆలూర్‌ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 13వ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలూర్‌ గ్రామంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో వేసిన ముగ్గులకు ఒకటవ రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. తరువాత …

Read More »

ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్ధం

కమ్మర్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి కిరాణా షాపు దగ్ధమైన ఘటన కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కోనాపూర్‌ గ్రామానికి చెందిన మ్యాకల శంకర్‌ మంగళవారం రోజున ప్రతిరోజులాగే రాత్రి సుమారు 8 గంటల సమయంలో కిరాణా షాపు మూసివేసి ఇంటికి వెళ్ళాడు. రాత్రి 1:30 గంటల సమయంలో కిరాణా దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు …

Read More »

ఆధునిక పద్దతులతో అధిక పాల ఉత్పత్తి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు అవలంబించి రైతులు అధిక పాలు ఉత్పత్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రైతులు పాలు పితికే యంత్రాలు ఉపయోగించాలని తెలిపారు. హైడ్రోఫోనిక్స్‌ గడ్డి పెంచే విధానం …

Read More »

న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఫాక్సో కోర్టు భవనంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవికి కళ్లద్దాలను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

లోక్‌ అదాలత్‌ ద్వారా శాశ్వత పరిష్కారం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టులో బుధవారం జాతీయ లోక్‌ అదాలత్‌ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంవత్సరాల తరబడి వివాదంలో ఉన్న రెవెన్యూ , కుటుంబ సమస్యలకు లోక్‌ అదాలత్‌ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. …

Read More »

ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. 18 …

Read More »

మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్‌ కామారెడ్డి, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్‌ ఎస్సై శంకర్‌ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో …

Read More »

బాసరకు ప్రత్యేక బస్సులు

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్‌ సదాశివ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్‌ మీదుగా, నిజామాబాద్‌ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More »

అంగరంగ వైభవంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు..

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో స్వామివారి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం, అభివృద్ధి కమిటీ, యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం, మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »