కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా …
Read More »ఆలూరులో అయ్యప్పస్వాముల ఆందోళన
ఆర్మూర్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి పి. డి.యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆలూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నరేష్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి …
Read More »కామారెడ్డిలో యోగా సాధన శిబిరం
కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 29వ తేదీ 2023 నుంచి ఫిబ్రవరి 5, 2023 వరకు వారం రోజుల పాటు యోగ సాదన శిబిరం నిర్వహించనున్నట్టు పరమపూజ్య స్వామి బ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా యోగ సాధన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో యోగ, ఈశ్వర ధ్యానము, దేశభక్తి, ఉత్తమ మానవ నిర్మాణం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. …
Read More »మెట్రో రైళ్ల సమయం పొడిగింపు…
హైదరాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో …
Read More »మౌనికను అభినందించిన ఎంపి
కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 25, గుడ్ గవర్నెన్స్ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఢల్లీిలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది అటల్ బిహారీ వాజ్పాయి గురించి మాట్లాడే …
Read More »టిపిటిఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి
కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిపిటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శులు సిహెచ్ లక్ష్మి, మీనా, భూషణ్, విజయ శ్రీ, నలిని దేవి, జి. సంతోషి, టి.శ్రీనివాస్, పి. అంజయ్య, కే శ్రీనివాస్, …
Read More »బడ్జెట్ అంచనాలు రూపొందించాలి
కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 సంవత్సరానికి మున్సిపల్ బడ్జెట్ అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మున్సిపల్ అధికారులతో బడ్జెట్ అంచనా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఆదాయం – వ్యయంలను తయారు చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధుల నుంచి 10 శాతం …
Read More »అనీమియా బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (24) పట్టణానికి చెందిన మహిళకు అనిమీయాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నాగసాయికి తెలియజేయడంతో వెంటనే స్పందించి 6వసారి సకాలంలో రక్తాన్ని …
Read More »గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అంతం లేదా?
ఆర్మూర్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర తెలంగాణలో గల్ఫ్ ఉద్యోగాల పేరిటి నకిలీ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు ఇష్టారాజ్యం నడుపుతున్నారని, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో నిత్యం అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారని, గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల పేరిటి లక్షల రూపాయలు గుంజుకొని విసిట్ వీసా పై పంపిస్తున్నారని, వారిని అదుపులో పెట్టే వారె లేరా అని ప్రవాస భారతీయుల హక్కుల వేదిక …
Read More »అయ్యప్ప స్వామి గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
బాన్సువాడ, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొడంగల్ గ్రామంలో నిర్వహించిన నాస్తికుల సభలో అయ్యప్ప స్వామిని కించపరుస్తూ నీచంగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన బైరి నరేష్ తక్షణమే అరెస్టు చేసి, పిడి యాక్ట్ విధించి, హిందూ మతంను దూషిస్తే పకడ్బందీగా అమలుపరిచే ఐపిసి. 295( వన్), 502( టు) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ అయ్యప్ప …
Read More »