బీర్కూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూరు మండల కేంద్రానికి చెందిన ధూళిగ లింగమయ్య ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉపాధి హామీ తరపున రెండు లక్షల చెక్కును, వైద్య ఖర్చులు క్రింద 73 వేల 223 రూపాయలను మంగళవారం ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు …
Read More »తెలంగాణలో భవిషత్తు బీజేపిదే
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …
Read More »రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ సెంటర్
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భవన నిర్మాణానికి భూమి …
Read More »బీజేపీకి తెలంగాణలో చోటు లేదు
ఆర్మూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్లో …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత…
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్ క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్లో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న జంగిటి …
Read More »క్రీడాకారులను అభినందించిన ప్రిన్సిపాల్
బాన్సువాడ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 17 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన డిగ్రీ కళాశాల జట్టును సోమవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాననికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 23న చెన్నైలోని అమితి యూనివర్సిటీలో జరిగే …
Read More »ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి మృతి
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భార్య భర్తల మధ్య గొడవతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై రాజరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన పరిద్కు నవీపేట్ మండలంలోని నాడపూర్ గ్రామానికి చెందిన సబ్రిన్తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు. అప్పటి నుంచి తరచు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో నాగేపూర్లో గతకొన్ని …
Read More »నవీపేట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో గా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మండలంలోని కొస్లీ పంప్ హౌస్ నుంచి అలీసాగర్ లిఫ్ట్ నుండి యాసంగి పంటకు సాగు నీళ్లను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీలు అమలుకై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 70లక్షల …
Read More »సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు …
Read More »ఆర్మూర్లో పెన్షనర్స్ డే
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ సంవత్సరం 17 డిసెంబర్ రోజు జరుపుకునే పెన్షనర్స్ డే ను ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ అందరి ఆరాధ్యదైవం కీర్తి శేషులు డి.ఎస్ .నకారాను స్మరించుకొని నివాళులర్పించారు. జిల్లా పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా ఈ నెల 17 న జరుపుకోవాల్సిన వేడుకలను ఆర్మూర్ డివిజన్ స్థాయిలో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో 8 …
Read More »